హలాల్ మాంసం ఎకనామికి జిహద్.. బీజేపీ నేత సీటీ రవి హాట్ కామెంట్స్
ఇప్పుడు ఎక్కడ చూసినా హలాల్ ఫుడ్ లభిస్తోంది. వాస్తవానికి దానికి ముస్లింలే తీసుకోవాలి.. కానీ హిందువులతోపాటు క్రిస్టియన్లు, సిక్కులు కూడా తీసుకుంటున్నారు. దీంతో కాంట్రవర్సీ నెలకొంది. దీనిపై బీజేపీ నేతలు గట్టిగానే స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సీటీ రవి స్పందించారు. హలాల్ మాంసం అనేది 'ఎకనామిక్ జిహాద్' అని హాట్ కామెంట్స్ చేశారు.
ఇప్పటికే కొన్ని గ్రూపులు హలాల్ ఫుడ్ తీసుకోవద్దని స్పస్టంచేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మేసెజ్ జోరుగా చేస్తున్నారు. హలాల్ మాంసం హిందువులు తినొద్దు అని కోరుతున్నారు. ప్రత్యేకంగా ఉగాది తర్వాత అసలు తినొద్దని అంటున్నారు. ఉగాది అనేది హిందువుల కొత్త సంవత్సరం అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పిలుపునిచ్చారు.
ఉగాది తర్వాత కొందరు.. నాన్ వెజ్ తినేవారు మాంసంతో పండగ మాదిరిగా చేసుకుంటారు. వారి కోసం ప్రత్యేకంగా హిందు అతివాద గ్రూపులు సందేశం ఇస్తున్నాయి. కర్ణాటకలో గల ఆలయాల్లో ముస్లింలు వ్యాపారం చేయడానికి వీలు లేదు. వారిపై నిషేధం విధించారు. ఆ తర్వాత గ్రూపుల్లో హలాల్ చేసిన మాంసం తినొద్దు అని షేర్ చేస్తున్నారు.
హలాల్ అనేది ఆర్థిక జిహద్ వంటిదని కామెంట్ చేస్తున్నారు. జిహద్ అంటే ముస్లింలు ఇతరులతో వ్యాపారం చేయడానికి వీలు లేదు. అలాంటి సమయంలో హలాల్ చేసిన మాంసం తీసుకోవడంలో అర్థం ఏముందని రవి ప్రశ్నించారు. హలాల్ చేసిన మాంసం.. ముస్లింలు దేవుడికి సమర్పిస్తారని.. మరీ దాంతో హిందువులకు ఒరిగేదేమీ ఉందని అడగారు. హలాల్ అనేది ముస్లింలు చేసి.. ఇతరులకు విక్రయం చేస్తారని తెలిపారు. మన మాంసం వారు తీసుకొని సమయంలో.. మరీ వారి మాంసం మనకు ఎందుకు అని అడిగారు. ముస్లింలు హలాల్ కానీ మాంసం తింటే.. హిందువులు కూడా తింటారని పేర్కొన్నారు.