జయ పిటిషన్: రాం జెఠ్మలానీ ప్లేసులో హరీష్ సాల్వే
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో బెంగుళూరు జైల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తరుపు న్యాయవాదులు గురువారం ఢిల్లీ చేరుకుని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కర్ణాటక హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంపై వారు ఈ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమచారం.
సుప్రీంకోర్టులో తన బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించే న్యాయవాదులను జయలలిత మార్చినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే సమయంలో హరీష్ సాల్వేతో వాదనలు వినిపించాల్సిందిగా ఆమె చెప్పినట్లు తెలుస్తుంది.

జయలలిత తరుపున కర్ణాటక హైకోర్టులో ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ వాదనలు వినిపించినా బెయిల్ రాలేదు. రాంజెఠ్మలానీ నిర్లక్ష్యం వల్లే, కర్ణాటక హైకోర్టులో తనకు బెయిల్ రాలేదని జయ భావిస్తున్నారట.
దీంతో సుప్రీం కోర్టులో తన బెయిల్ పై హరీశ్ సాల్వే వాదనలు వినిపించేలా చూడాలని తన అనునచరులకు ఆమె ఆదేశాలు జారీ చేశారట. దీంతో రాంజెఠ్మలానీ స్థానంలో ఇకపై హరీశ్ సాల్వే, జయలలిత న్యాయవాదిగా కొనసాగనున్నారు.
సుప్రీంకోర్టుకు ఈ నెల 18 నుంచి 26 వరకు దీపావళి సెలవులు. దీంతో 18 లోపల జయ అప్పీల్ను సుప్రీం కోర్టు విచారణకు తీసుకోకపోతే దీపావళి పండుగనాడు కూడా జయలలిత జైల్లోనే గడపాల్సి ఉంటుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications