మహారాష్ట, హర్యానాలో వార్ వన్సైడే! హుజూర్ నగర్లో కారు జోరు సాగే..
తెలంగాణలోని హుజూర్నగర్ ఉప ఎన్నిక, హర్యానా, మహారాష్ట్రలోని అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 51 శాసన సభా స్థానాలకు ఉప ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారింది. అక్టోబర్ 21వ తేదీన పోలింగ్ చెదురు మదురు సంఘటనతలతో ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 24 తేదీన 17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ స్థానాలకు, హర్యానా, మహారాష్ట్రకు సంబంధించిన ఫలితాలు వెలువడున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన మీడియా సంస్థలు న్యూస్ ఎక్స్, ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ, న్యూస్ 18 లాంటి, ఇండియా టీవీ లాంటి సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే అవకాశం ఉంది.
సోమవారం (అక్టోబర్ 21వ తేదీన) ఉదయం నుంచి రాత్రి వరకు సమగ్రంగా అందించేందుకు తెలుగు వన్ ఇండియా సిద్ధమైంది. అభ్యర్థుల అధ్యికత, గెలుపు ఓటములు సమాచారం.. పార్టీల బలాబలాలు, ఫలితాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెబ్ మాధ్యమం ద్వారానే కాకుండా ఫేస్బుక్, ట్విట్టర్, హలో యాప్ లాంటి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పాఠకులకు అందించేందుకు అత్యాధునిక సాంకేతికతతో తెలుగు ఇండియా టుడే ముందుకొస్తున్నది. వార్తలు, వీడియో కథనాల కోసం నిరంతర ప్రత్యక్ష వార్తా సమాచారం కోసం telugu.oneinida.com ఫాలో అవ్వండి.