మధ్యాహ్నా భోజనంలో పాముపిల్ల!: హడలెత్తిన విద్యార్థులు, ఏంటీ దారుణం.
నాణ్యత లేని ఆహారం అందించడం ఎప్పటినుంచో కొనసాగుతుందని, అయితే ఇలా పాముపిల్ల రావడం మరీ దారుణం అని విద్యార్థులు వాపోయారు.
ఫరిదాబాద్: హర్యానాలోని ఓ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన ఇది. ఏకంగా విద్యార్థులు తినే మధ్యాహ్నాం భోజనంలో ఓ పాము పిల్ల దర్శనమిచ్చిందంటే.. వారి పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫరీదాబాద్ లోని రాజ్కేయా బాలికల సీనియర్ పాఠశాలలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
మధ్యాహ్నా భోజన సమయంలో.. విద్యార్థులంతా భోజనం చేస్తుండగా.. ఓ విద్యార్థిని తింటున్న భోజనంలో చచ్చిన పాముపిల్ల కనిపించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థిని తోటి విద్యార్థినులకు విషయం చెప్పింది. ఆపై విద్యార్థులంతా భోజనం తినడం ఆపేశారు. కొంతమంది విద్యార్థులు వాంతులు కూడా చేసుకున్నారు.

నాణ్యత లేని ఆహారం అందించడం ఎప్పటినుంచో కొనసాగుతుందని, అయితే ఇలా పాముపిల్ల రావడం మరీ దారుణం అని విద్యార్థులు వాపోయారు. విద్యార్థుల ఫిర్యాదుతో అప్రమత్తమైన ప్రిన్సిపాల్.. భోజనం సరఫరా చేసే ఇస్కాన్ ఫౌండేషన్ యాజమాన్యానికి ఫోన్ చేసి విషయం చెప్పారు. వేరే స్కూల్స్ కు పంపించిన భోజనాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. అనంతరం పరీక్షల నిమిత్తం ఆ ఆహార పదార్థాలను ల్యాబ్కు పంపించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications