వేరే దేశంలో బెదిరిస్తారా?: పద్మావతి చిత్రం ఆందోళనపై హైకోర్టు ఆగ్రహం
ముంబై: పద్మావతి చిత్రంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై బాంబే హైకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. కళాకారులను చంపేస్తామని ఇతర దేశాల్లో బెదిరించరని వ్యాఖ్యానించింది.
వేరే ఏ దేశంలోనైనా ఇలా కళాకారులను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడతారా? చాలామంది కష్టపడి ఓ సినిమాను తీస్తే బెదిరింపుల కారణంగా సినిమా విడుదల అవకపోవడం చాలా బాధాకరమని, ఈ దేశంలో ఓ ఫీచర్ చిత్రాన్ని విడుదల కానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలు మనం ఏ స్థితికి చేరుకున్నామని, కళాకారుల తల నరికి తెస్తే రివార్డులు ఇస్తామని ప్రకటిస్తున్నారని, వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా వారితో సమానంగా ఆందోళనలు చేస్తూ సినిమాను నిషేధించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మరో రకమైన సెన్సార్షిప్ అని చెప్పింది.
పేరు, డబ్బున్న వారికే ఇలాంటి సమస్యలు ఎదురు అవుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. కాగా, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతి చిత్రంపై పలు రాష్ట్రాల్లో నిషేధం విధించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications