ప్రధాని మోదీ కశ్మీర్ కు న్యాయం చేశారు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, మాజీ ప్రధాని
కశ్మీర్లోని శివాలయానికి 230 మెట్లు ఉన్నాయని, ఆ మెట్లు ఎక్కడం కష్టం అని, గతంలో నేను ఆ గుడిలో 30 మెట్లు మాత్రమే ఎక్కానని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు.
శనివారం హాసన్ లో మాజీ ప్రధాని దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. ఇదే సమయంలో దేవేగౌడ కశ్మీర్ పర్యటనకు సంబంధించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ గొప్పగా చెప్పారు.
సీఆర్పీఎఫ్ జవాన్లు తనను కాశ్మీర్ లోని శివుడి ఆలయానికి తీసుకెళ్లి పూజలు చేయించారని మాజీ ప్రధాని దేవేగౌడ గుర్తు చేసుకున్నారు. కాశ్మీర్ లోని నాథద్వారా ప్రాంతంలో కృష్ణుని ఆలయం కూడా ఉందని, ఆ గుడి చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయమని, తాను కూడా అక్కడికి వెళ్లానని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ చెప్పారు. తరువాత కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఎక్కువ కావడంతో ఆ ప్రాంతానికి పర్యాటకులు వెళ్లడం చాలా వరకు తగ్గిపోయిందని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారని దేవేగౌడ అన్నారు. మోదీ ప్రధాని అయిన తరువాత కాశ్మీర్ లో ఉగ్రవాదులను నియంత్రించారని, కశ్మీర్లో మునుపటిలాగా ఆందోళన వాతావరణం లేదని, అందువలన పెద్ద సంఖ్యలో పర్యాటకులు కూడా అక్కడికి వెళ్లి అక్కడి సుందరమైన ప్రదేశాలు చూడవచ్చు అని మాజీ ప్రధాని దేవేగౌడ చెప్పారు. కశ్మీర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ కఠిన నిర్ణయం తీసుకున్నారని దేవేగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు.
గతంలో కాశ్మీర్ లో కొనసాగిన ఉగ్రవాదుల చొరబాటుకు కళ్లెం వేశారని, దాని ఫలితంగా నేడు సామాన్యులు మనశ్శాంతితో కాశ్మీర్ లోని వీధుల్లో తిరుగుతున్నారని, ప్రస్తుతం అక్కడ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. కాశ్మీర్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మంచి పని చేశారని, మోదీ ప్రధాని అయ్యాక కాశ్మీర్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, అందుకే మోదీకి కశ్మీర్ ప్రజలుమద్దతిస్తున్నారని మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్ డీ దేవేగౌడ అన్నారు.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications