Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ఎన్నికల కోసం కనకమహాలక్ష్మి కలెక్షన్, మంచం కింద కోట్ల కేసు ఎవరికి అప్పగిస్తారు ?

బెంగళూరు/హైదరాబాద్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో (Bengaluru) కాటన్ బాక్సుల్లో కనకమహాలక్ష్మి డ్యాన్స్ చేస్తోందని, అది కూడా సోఫాలు, మంచం కింద డబ్బులు ఉన్నాయని, ఐటీ రైడ్‌లో కాంట్రాక్టర్ ఇంట్లో దొరికిన డబ్బు ఎవరిది ? అని కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (hd kumaraswama) సీఎం సిద్దరామయ్యను (siddaramaiah) ప్రశ్నించారు.

దీనిపై హెచ్‌డీ కుమారస్వామి (hd kumaraswama)ట్వీట్ చేశారు. ఐటీ రైడ్ (IT Raids) సమయంలో కాంట్రాక్టర్ ఇంట్లో దొరికిన డబ్బు ఎవరిది? ఈ పాపం డబ్బు ఎవరి భుజాల మీద మోసింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మాజీ సీఎం కుమారస్వామి కర్ణాటక సీఎం సిద్దరామయ్య (siddaramaiah) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు బీబీఎంపీ (BBMP) నుండి రూ 650 కోట్ల బిల్లులు విడుదల అయిన తర్వాత ఈ రూ. 42 కోట్లు ఐటీ అధికారులు పట్టుబడతారు.

HD Kumaraswama accused Congress of trying to send Rs 42 crore to Telangana assembly election 2023.

అక్కడ కాంగ్రెస్ (Congress)ప్రభుత్వం కలెక్షన్ నిజమైందని కుమారస్వామి ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దలకు ఎంత శాతం వాటా? దాని వెనుక దాగిన ఆదిపురుషులు ఎవరు? అని కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి (hd kumaraswama)కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (siddaramaiah)ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 23 అట్ట బాక్సుల్లో నింపిన ఈ డబ్బులు పొరుగున ఉన్న తెలంగాణకు వెళుతున్నట్లు సమాచారం ఉందని మాజీ సీఎం కుమారస్వామి (hd kumaraswama)సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ డబ్బు వసూలు చేసిన మాట వాస్తవమే అని, ఈ కనక మహాలక్ష్మి కలెక్షన్‌ను బెంగళూరు (Bengaluru) నగరాభివృద్ధి శాఖ'కు అప్పగించినట్లు మరో సమాచారం ఉందని, ఈలోగా ఐటీ శాఖ ఎఫెక్ట్ తో రహస్యం మొత్తం బట్టబయలు అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్సంటేజ్ శాతం ఆధిపత్యం అగమ్యగోచరంగా మారిందా? అని మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు.

HD Kumaraswama accused Congress of trying to send Rs 42 crore to Telangana assembly election 2023.

ఇప్పుడు అ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah)బహిరంగంగా మాట్లాడాలని కుమారస్వామ డిమాండ్ చేశారు. మంచం కింద చిక్కిన రూ 42 కోట్ల కేసు మీద మీరు ఏ దర్యాప్తు చేస్తారు? సీబీఐ (CBI), ఈడీ (ED), సిట్టింగ్ జడ్జీలు, రిటైర్డ్ జడ్జీలు.? ఎలా ఎవరికి ఈ కేసు అప్పగిస్తారో దయచేసి చెప్పండి అని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి (hd kumaraswama) సీఎం సిద్దరామయ్యను (siddaramaiah) ప్రశ్నించారు.

కర్ణాటకలో (Karnataka) విపరీతమైన కరువు, కరెంటు కష్టాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేతివాటం చూపించి కలెక్షన్ మాత్రం తెలివిగా సేకరిస్తోందని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి (hd kumaraswama) ఆరోపించారు. ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు మొదలుకావడంతో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ATM అయ్యిందని కుమారస్వామి ఆరోపించారు.

HD Kumaraswama accused Congress of trying to send Rs 42 crore to Telangana assembly election 2023.

తమిళనాడుకు (Tamil Nadu) కావేరీ నీటి ప్రవాహం కొనసాగుతోందని, కన్నడిగుల కనకమహాలక్ష్మిని ఇతర రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల్లో భాగం అయ్యిందని, మొదటి నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీది ఇదే కథ అని, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే ఢిల్లీలోని (Delhi) కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు పండగే అని మాజీ సీఎం కుమారస్వామి ఎద్దేవ చేశారు.

ఇప్పటికీ అదే జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కర్ణాటకను కేటాయించారు. ఓటు వేసిన తప్పిదానికి కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేస్తెందని, ఇది కన్నడిగుల కర్మ అని కుమారస్వామి (hd kumaraswama)కర్ణాటకకు కాంగ్రెస్ (Congress) కన్నడ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి ట్విట్టర్ (X)లో పోస్టు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+