నేపాల్ లో హెలికాప్టర్ కూలిపోయి నలుగురి దుర్మరణం
ఖాట్మండ్: సహాయక చర్యలలో పాల్గోనడానికి వెళ్లిన హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయిన సంఘటన నేపాల్ లో జరిగింది. నేపాల్ భూకంప బాధితుల పునరావాస కార్యక్రమాలలో పాల్గొనేందుకు వెళ్లిన హెలికాప్టర్ మంగళవారం కుప్పకూలిపోయింది.
నేపాల్ లోని దోలఖా ప్రాంతంలో పునరావాస సామాగ్రిని పంపిణీ చేసిన తరువాత నలుగురు హెలికాప్టర్ లో ఖాట్మండ్ బయలుదేరారు. మార్గం మధ్యలో యమునా దండా గ్రామం సమీపంలో కుప్పకూలిపోయింది.

విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారని నేపాల్ అధికారులు చెప్పారు.
యమునా దండా గ్రామం సమీపంలోని షిలా పరబత్ అడువుల్లో హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేశారు. హెలిక్యాప్టర్ హై టెన్షన్ వైర్లు తాకడం వలనే కుప్పకూలి పోయిందని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications