ఆ సీఎంను అరెస్టు చేస్తాం: సుప్రీం కోర్టులో సీబీఐ
న్యూఢిల్లీ: అక్రమాస్తులు సంపాధించిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ను, ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో సీబీఐ అధికారులు పిటీషన్ వేశారు.
సీబీఐ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని ధర్మాసనం దసరా తరువాత విచారణ చేపడతామని పేర్కోంది. ఈ ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి అరుణ్ మిశ్రా ఈ విషయంపై ఇలా వ్యాఖ్యానించారు.

ఈ పిటీషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టే అంశంగా తాము భావించడం లేదని, వెంటనే వాదోపవాదాలు ప్రారంభించలేమని అన్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ అయ్యే వరకు వేచి చూడాలని సీబీఐ భావించింది.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యులు అక్రమాస్తులు సంపాదించారని సీబీఐ కేసు నమోదు చేసింది. తనతో పాటు కుటుంబ సభ్యులను అరెస్టు చెయ్యకుండా వీరభద్ర సింగ్ ఆ రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించారు.
వీరభద్ర సింగ్, ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చెయ్యరాదని హియమాచల్ ప్రదేశ్ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications