ఫోన్లో ఫోటో దిగితే చాలు.. వెంటనే రేషన్ అందజేత.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
పేద, మధ్య తరగతి ప్రజల కోసం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఈ లెక్కన దేశంలో కోట్ల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే సాధారణంగా మనం రేషన్ షాప్ కు వెళ్లి మన దగ్గర ఉన్నరేషన్ కార్డుతో మ్యానువల్ గా రాయించుకొని లైనులో నిలబడి రేషన్ తీసుకుంటాం. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ పాస్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ పాస్ యంత్రాల్లో ఫింగర్ ప్రింట్ లేదా, ఐరిస్ స్కాన్ ద్వారా బయోమెట్రిక్ పూర్తిచేసి రేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈ యంత్రాల్లో నెట్ వర్క్ సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో టెక్నాలజీ ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధానం ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా రేషన్ దుకాణాల్లో వినియోగదారుల ముఖాన్ని స్కాన్ చేసి వారికి రేషన్ అందజేస్తున్నారు.

సరికొత్త సాంకేతిక విధానం ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక్క ఫోటో దిగితే చాలు రేషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కొత్త టెక్నాలజీని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం విజయవంతంగా అమలు చేస్తోంది. అంతేకాక ఈ వ్యవస్థను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగానూ హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. మొన్నటి వరకూ ఇతర రాష్ట్రాల మాదిరిగానే హిమాచల్ లోనూ ఈ పాస్ యంత్రం ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ కొనసాగేది.
Himachal becomes first state to launch Aadhaar-based face authentication for ration distributionhttps://t.co/5FZIopZoWK
— Economic Times (@EconomicTimes) July 6, 2025
అయితే గత కొద్దికాలంగా ఈ యంత్రాల్లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రజలు గంటల తరబడి రేషన్ షాపుల వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఈ మేరకు ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ సమస్యపై దృష్టిపెట్టింది హిమాచల్ ప్రభుత్వం. అందులో భాగంగానే ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల రేషన్ డీలర్లు ఈ కొత్త టెక్నాలజీని అమలు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక రేషన్ దుకాణాలలో ఈ టెక్నాలజీని వినియోగించి రేషన్ పంపిణీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications