రూ.లక్ష తీసుకొని దేశం విడిచి వెళ్లండి: జడ్జికి చెక్కు
చెన్నై: వివాదాస్పద మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్కు హిందుత్వ సంస్థ ఒకటి రూ.లక్ష చెక్కును పంపించి దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. ఇటీవల తన బదిలీపై తానే స్వయంగా స్టే విధించుకుని, సుప్రీం కోర్టునే కర్ణన్ ప్రశ్నించారు.
దీనిపై హిందూ సంస్థ ఒకటి అతనికి లక్ష రూపాయల చెక్కును పంపించి, దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించింది. తమిళనాడులో రిజిస్టరయిన హిందూ మక్కల్ కట్చి అనే సంస్థ తాము కర్ణన్ ను వేరే ఏదైనా దేశానికి వెళ్లాలని కోరినట్టు తెలిపింది.

ఇందుకోసం లక్ష రూపాయల చెక్కును పంపామని హిందూ మక్కల్ కట్చి అధ్యక్షులు అర్జున్ సంపత్ తెలిపారు. ఆయన భారత రాజ్యాంగాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందునే ఇలా చేశామన్నారు. కర్ణన్ తమ చెక్కును క్యాష్ చేసుకుంటే, తాను ఏ దేశానికి వెళుతున్నానన్న విషయం తమకు చెబితే చాలని, ఇంకేమీ అడగబోమన్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. వివక్ష కనిపిస్తోందని, ఇలాగైతే తాను దేశం విడిచి వెళ్తానని వ్యాఖ్యానించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications