కర్ణాటకలో ప్రజాస్వామ్యం హత్య: నిప్పులు చెరిగిన రాహుల్
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో బిఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ద్వారా ప్రజాస్వామ్యం హత్య చేయబడిందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. గురువారం నాడు ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ తన విమర్శలను ఎక్కుపెట్టారు.
కర్ణాటకలో ప్రజాస్వామ్యం హత్య చేయబడడంతో దేశమంతా చింతిస్తోందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కానీ, కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందకు బిజెపి సంబరాల్లో మునిగిపోయిందన్నారు.

సంఖ్యా బలం లేకపోయినా బీజేపీ దొడ్డిదారిన అధికారానికి వచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ఆయన అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించిందని రాహుల్ విమర్శలు గుప్పించారు.
మే 12వ తేదిన జరిగిన ఎన్నికల్లో బిజెపి 104 ఎమ్మెల్యేలను గెలుచుకొంది. కాంగ్రెస్ కు 78, జెడి(ఎస్)కు 38 స్థానాలు దక్కాయి. దీంతో కాంగ్రెస్,. జెడి(ఎస్)లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించాయి.
అంతేకాదు ఈ తరుణంలో బిజెపిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. బిఎస్ యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications