ఇంట్లో ఉంటున్న అందమైన భార్యకు ఆమె బంధువుతో ?, రాత్రి ఇంట్లో భర్త ఏం చేశాడంటే ?!
కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా జీవించారు. అందమైన భార్య చిక్కడంతో అతను హ్యాపీగా ఉన్నాడు. రోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళితే సాయంత్రం ఇంటికి వెలుతున్న భర్తకు రానురాను అతని భార్య మీద అనుమానం వచ్చింది. భర్త అనుమానం పెనుభూతం అయ్యింది. అంతే భార్యను చంపేసిన భర్త అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
పనికి వెళ్దకుండా ఇంట్లోనే కాపలా ఉంటున్న భర్తకు బుద్దిమాటలు చెప్పినందుకు ఓ మహిళ హత్యకు గురైయ్యింది. భార్యను దారుణంగా హత్య చేసిన తరువాత భర్త కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని హుబ్బళిలోని ఇస్లాంపూర్లో చోటుచేసుకుంది. సాహిస్తా బేపారి అలియాస్ సాహిస్తా(25) అనే మహిళను హత్య చేసిన ఆమె భర్త మల్లిక్ (28) తరువాత అతను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సాహిస్తా, మల్లిక్ నాలుగు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. దంపతుల ఇంటికి బంధువులు వచ్చి వెలుతున్నారు వివాహం జరిగిన తరువాత భార్య సాహిస్తాతో చాలా సంతోషంగా ఉంటున్న మల్లిక్ సెంట్రింగ్ పని చేసేవాడు. ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెలుతున్న మల్లిక్ సాయంత్రం పని ముగించుకుని తరువాత బార్ లోకి వెళ్లి మద్యం సేవించి రాత్రి ఇంటికి చేరుకునేవాడు. పగలు ఇంట్లో మల్లిక్ భార్య సాహిస్తా మాత్రమే ఉంటున్నది.
అందమైన భార్య సాహిస్తా ఇంట్లో ఒంటరిగా ఉంటుందని, నేను ఇంట్లో లేని సమయంలో ఆమె బంధువులు ఇంటికి వచ్చి వెలుతున్నారని, తన భార్యకు అక్రమ సంబందం ఉందని మల్లిక్ కు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో మల్లిక్, సాహిస్తా దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. చివరికి భార్య మీద విపరీతంగా అనుమానం పెంచుకున్న మల్లిక్ పనికి వెళ్లకుండా భార్య సాహిస్తాకు కాపాలా ఉంటూ ఇంట్లోనే ఉండిపోయాడు.

పని చెయ్యడానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న భర్త మల్లిక్ ను పనికి వెళ్లాలని అతని భార్య సాహిస్తా చెప్పింది. తాను ఇంటి నుంచి బయటకు వెలితే నీ ప్రియుడు ఇంటికి వస్తాడని ఆశపడుతున్నావా, అలాంటి చాన్స్ నీకు ఇవ్వనని, నేను మాత్రం పనికి వెళ్లనని మల్లిక్ అతని భార్యకు చెప్పాడు. పనికి వెళ్లకుంటా సంసారం ఎలా సాగుతుందని, ఖర్చులకు డబ్బులు ఎవరు ఇస్తారని మల్లిక్ ను అతని భార్య సాహిస్తా నిలదీసింది.
కొంతకాలం నుంచి ఇదే విషయంలో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన మల్లిక్ భార్య సాహిస్తాతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత సహనం కోల్పోయిన మల్లిక్ సెంట్రింగ్ పని కోసం ఉపయోగించే ఇనుపరాడ్ తీసుకుని అతని భార్య సాహిస్తా తల మీద దాడి చేసి దారుణంగా చంపేశాడు. తరువాత మద్యం మత్తులోనే మల్లిక్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాహిస్తా హత్యకు గురైయ్యిందని, మల్లిక్ ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూసిందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications