సిగ్గుపడుతున్నా, శిక్షించండి: సైన్యంపై చేసిన వ్యాఖ్యలకు ఓంపురి
ముంబై: భారత సైనికులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటుడు ఓం పురి.. తన తప్పును తెలుసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎంతో సిగ్గుపడుతున్నట్లు తెలిపారు.
యూరీ ఉగ్రవాద ఘటనలో సైనికులు మరణించడంపై ఓంపురి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'ఎవరు వారిని సైన్యంలో చేరమన్నారు? ఎవరు ఆయుధాలు చేతపట్టమన్నారు' అని అన్నారు. దీంతో భారత్లో పుట్టి భారత సైన్యాన్ని కించపరుస్తూ మాట్లాడతారా? అంటూ ఆయనపై పలువురు ప్రముఖులతోపాటు పెద్ద ఎత్తున నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో ఓంపురి మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. 'నేను చేసినవ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా. తప్పు చేశాను. నన్ను శిక్షించాల్సిందే. ముందు నేను యూరీ ఘటనలో వీరమరణం పొందిన వారికి క్షమాపణ చెప్తున్నా. వారు నన్ను మన్నిస్తే భారతదేశానికి, సైన్యానికి క్షమాపణ చెప్పుకుంటాను' అని తెలిపారు.
అంతేగాక, 'నోటికొచ్చినట్లు వాగేసి ఇప్పుడు సారీ చెప్పినంత మాత్రాన అంతా సద్దుమణగదని నాకు తెలుసు. నన్ను మన భారత సైనికులే శిక్షించాలి. వారే నాకు ఆయుధాన్ని చేతబట్టడం అంటే ఏంటో తెలిసేలా చేయాలి. ఉగ్రదాడి జరిగిన చోటికి నన్ను పంపించాలి. నన్ను క్షమించకూడదు. నేను శిక్షార్హుడిని' అంటూ ఓంపురి తాను చేసిన తప్పుడు వ్యాఖ్యలకు చింతించారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications