మాయావతి సోదరుడికి ఐటీ శాఖ షాక్.. రూ.400కోట్ల ఆస్తులు సీజ్..
ఢిల్లీ : ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి సోదరుడికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన దాదాపు రూ.400కోట్ల విలువైన ఏడెకరాల భూమిని జప్తు చేసింది. దీనికి సంబంధించి ఐటీ శాఖ బినామీ ప్రొహిబిషన్ యూనిట్ జులై 16న ఉత్తర్వులు జారీ చేయగా... దాన్ని గురువారం అమలు చేశారు. ఆనంద్ కుమార్తో పాటు ఆయన భార్య విచితర్ లత పేరుపై ఉన్న న్యూఢిల్లీ, నోయిడాలోని ఆస్తులను జప్తు చేశారు.

ఆనంద్ కుమార్ను గత జూన్లో బీఎస్పీ వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. నోయిడా అథారిటీలో క్లర్కుగా పనిచేసిన ఆయన.. అనంతరం నకిలీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు రుణాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనంద్ 49 కంపెనీలు ప్రారంభించారు. దీంతో ఆయన ఆస్తుల విలువ ఒకేసారి రూ.1316 కోట్లకు చేరింది. దీనిపై అప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆనంద్ కుమార్ ఆస్తులపై విచారణ ప్రారంభించింది. తాజాగా ఐటీ శాఖ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్ 1988 సెక్షన్ 24(3) ప్రకారం చర్యలు ప్రారంభించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications