గుడ్ న్యూస్: ఇక ఇంట్లోనే యాంటిజెన్ టెస్ట్.. ఎవరికీ వారు పరీక్ష..? నెగటివ్ వచ్చినా..
కరోనా కేసుల టెస్టులను ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద చేస్తున్నారు. కొందరు ప్రైవేట్గా కూడా టెస్టులు చేస్తున్నారు. అయితే యాంటిజెన్ పరీక్ష తేలిక.. ప్రెగ్నేన్సీ టెస్ట్ మాదిరిగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కరోనా లక్షణాలు ఉంటే ఇంట్లోనే పరీక్ష చేసుకోవచ్చు. ఇందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది.

ఒకవేళ మీరు ఇంట్లోనే టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తే అంతే.. మరోసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నెగటివ్ వస్తే మాత్రం ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. కొన్ని సందర్భాల్లో యాంటిజెన్ రానందున.. ఆర్టీ పీసీఆర్ అవసరం ఉంటుంది. నెగటివ్ వచ్చిన వారు పాజిటివ్ కేసులా అని అనుమానించాల్సి ఉంటుందని పేర్కొన్నది.
టెస్టుకు సంబంధించి ఉత్పత్తిదారు ఇచ్చిన సూచనల మేరకు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి యాప్ కూడా అందుబాటులో ఉందని వివరించింది. పరీక్ష ఎలా చేయాలి.. పాజిటివ్ ఎలా వస్తోంది.. నెగటివ్ ఎలా వస్తుందనే అంశంపై క్లారిటీగా ఉండనుంది. ఎవరికీ వారు టెస్ట్ చేసుకొని.. జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications