ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 300 ప్లస్, కాంగ్రెస్ డౌన్
దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే మళ్లీ భారతీయ జనతా పార్టీనే భారీ మెజార్టీతో అధికార చేపడుతుందని ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ 343 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఇండియా టుడే సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ ఓపీనియన్ పోల్ వెల్లడించింది.
ఇక, 2024 లోక్సభ ఎన్నికల్లో 232 స్థానాలు సాధించిన కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి భారీగా స్థానాలు తగ్గి 188 సీట్లకే పరిమితమవుతుందని తాజా సర్వే తేల్చింది. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు అన్ని లోక్సభ నియోజకవర్గాల్లోని 1,25,123 మందిని సర్వే చేయగా ఈ విషయాలు వెలుగుచూశాయి. ఓట్ షేర్ కూడా ఎన్డీఏకు 3 శాతం పెరిగి 47 శాతం సాధిస్తుందని తెలిపింది. ఇండియా కూటమి కేవలం 1 శాతం ఓట్లను పెంచుకుంటుందని పేర్కొంది.
.

ఇప్పటికిప్పుడు ఈరోజే ఎన్నికలు జరిగితే బీజేపీ ఒంటరిగానే 281 సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. ఇక, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు వచ్చిన 99 స్థానాల నుంచి 78కి పడిపోతుందని అంచనా వేసింది. బీజేపీకి 3 శాతం ఓటింగ్ పెరగడంతో 41 శాతానికి చేరనుండగా. కాంగ్రెస్ పార్టీ మాత్రం 20 శాతం దగ్గరే నిలిచిపోయింది.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో బాధపడుతోందని, అది ఆ పార్టీ నిర్మాణంలోనే ఉందని రాజకీయ విశ్లేషకులు యామిని అయ్యర్ ఇండియా టుడేతో అన్నారు. కాగా, గత ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినప్పటికీ.. ఆ మార్క్ సాధించలేకపోయింది. అంతేగాక, ప్రభుత్వ ఏర్పాటులో బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.
బీజేపీని 400 సీట్ల నినాదమే దెబ్బతీసిందని తెలుస్తోంది. 400 సీట్లు వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో దళిత, ఓబీసీ ఓట్లను బీజేపీకి దూరం చేసే కాంగ్రెస్ ప్రయత్నం కొంతమేర సఫలీకృతమైనట్లు తెలుస్తోంది. అయితే, సార్వత్రికి ఎన్నిలు జరిగిన ఆరు నెలల తర్వాత వరుసగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం గమనార్హం. ఢిల్లీలో దాదాపు 27 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications