Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ణాటక భిక్షతో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. లూటీ డబ్బులు, మీది ఒక గెలుపేనా ?, హెచ్ డీకే !

ప్రజలను మోసం చేసి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును తెలంగాణలో ఖర్చుపెట్టిందని, అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల పాటు కన్నడిగులను లూటీ చేసిన సిద్దరామయ్య ప్రభుత్వం ఆ డబ్బు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసందని కుమారస్వామి ఆరోపించారు.

బెంగళూరులో ఆదివారం మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం కుమారస్వామి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తించిన తీరుపై విరుచుకుపడ్డారు. ఐదు రాష్ట్రాలలో విజయం సాధిస్తామని చెప్పుకున్న కాంగ్రెస్ కర్ణాటకను భ్రష్టు పట్టించిందని కుమారస్వామి అన్నారు. తెలంగాణ విజయం కాంగ్రెస్ పార్టీ సొంతంగా సాధించిన విజయం కాదని కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.

If the looted money in Karnataka is spent in Telangana, Congress will win, says former CM HD Kumaraswamy

దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభావం తగ్గుముఖం పట్టిందనడానికి ఈ ఫలితాలు నిదర్శనమని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. పలు పోలింగ్ కేంద్రాలు ప్రజల బారులు తీరి ఓట్లు వేశారని, ఈ సర్వేలు రెండు రాష్ట్రాల్లో బీజేపీ, రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశాయని, అన్నీ తలకిందులయ్యాయని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతుగా ఓటర్లు నిర్ణయం తీసుకున్నారని మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి అనేక సవాళ్లు ఎదురవుతాయని, ఎన్నో కోరికలతో, ఆలోచింపజేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని, వాళ్ల ఆశలు నెరవేరవని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి వ్యంగంగా అన్నారు.

కర్ణాటక నేతల ప్రచారం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ గెలవలేదని, కర్ణాటక నుంచి అక్కడికి పంపిన సొమ్ములు, సూట్ కేసుల కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం అని, తెలంగాణ ప్రజలు సామాజిక సేవను, ప్రజాసేవను, అభివృద్ధిని ఆశించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి అనేక కారణాలున్నాయని అన్నారు.

If the looted money in Karnataka is spent in Telangana, Congress will win, says former CM HD Kumaraswamy

లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం లేదని, బీజేపీ కూటమి కచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అపూర్వ విజయం సాధించినందుకు బీజేపీకి, ఆ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నానని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయ పతాకాన్ని ఎగురవేసిందని, రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ ఫలితాలు స్పష్టమైన దిక్సూచి అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+