Illegal affair: ఆంటీతో మొగుడు జల్సాలు, మగాడికి వేరే టేస్ట్ ఉండాలి తెలుసా ?, ఒక్క దెబ్బతో !
బెంగళూరు/ చిత్రదుర్గ: ట్రావెల్ ఎజెన్సీలో భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్న భర్త ఓ ఆంటీని తగులుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. అక్రమ సంబంధం విషయంలో నిత్యం దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఒకే ఫ్యామిలీలో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్య, కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటి హత్య చేసిన భర్త అతను నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కారణంతో అతి దారుణంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఒకే ఫ్యామిలీలో ముగ్గురి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా తయారు కావడం కలకలం రేపింది.
Nurse: అంబులెన్స్ లో అబ్బాయితో అదరగొట్టిన ఆంటీ, దెబ్బకు ఏరియానే హడల్, పంచాయితీతో క్లైమాక్స్ !
భార్య, కూతురితో హ్యాపీలైఫ్
కర్ణాటకలోని చిత్రదుర్గలోని గారపట్టి లేఔట్ లో అరుణ్ కుమార్ (43), లతా (35) దంపతులు నివాసం ఉంటున్నారు. అరుణ్ కుమార్, లతాకు 16 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. అరుణ్ కుమార్, లతా దంపతుల కుమార్తె అమృత (14). అరుణ్ కుమార్ ప్రైవేట్ బస్సుల (ట్రావెల్స్) ఏజెంట్ గా పని చేస్తున్నాడు. లతా ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నది.
సార్ కు సెకండ్ సెటప్
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిత్రదుర్గలో అరుణ్, లతా దంపతులు నివాసం ఉండటంతో వీరు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. అరుణ్ కుమార్, లతా దంపతులు కుమార్తె అమృతను చూసుకుంటూ చాల సంతోషంగా గడిపేవారు. అయితే కొంత కాలం నుంచి అరుణ్ కుమార్ వేరే ఆంటీతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలిసింది. తన విషయం భార్య లతాకు తెలీదని చాల కాలం అరుణ్ కుమార్ భ్రమలో ఉండేవాడు.
నాకు ఆంటీ అవసరం... ఎంజాయ్ చేస్తున్నా
అరుణ్ కుమార్ వేరే మహిళతో అక్రమ సంబంధం సాగిస్తున్న విషయం అతని భార్య లతాకు తెలిసిందిపోయింది. భర్త అరుణ్ కుమార్ అక్రమ సంబంధం విషయంలో అతని భార్య లతా నిలదీసింది. ఇదే విషయంలో అరుణ్ కుమార్, లతా దంపతుల మధ్య రోజూ గొడవలతో ఇంటిలో రచ్చ రచ్చ అయ్యేది. నా కోరికలు తీర్చడానికి నువ్వు కాకుండా నాకు వేరేవాళ్లు అవసరం, అందుకే ఎంజాయ్ చేస్తున్నా, నాలాగా చాలా మంది మగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారని అరుణ్ కుమార్ భార్య లతాతో ఎదురుతిరిగేవాడు.
పేరుకే పెద్దల పంచాయితి
అరుణ్ కుమార్, లతా దంపతుల గొడవ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చాలా సార్లు పంచాయితీలు చేశారు. నిత్యం మీరు ఇలాగే గొడవలు పడుతుంటే మీ కుమార్తె అమృత చదువు మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందని పెద్దలు హెచ్చరించారు. అయినా అరుణ్ కుమార్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. పెద్దలు పంచాయితీలు చేసినా వీరి కాపురంలోని గొడవలు మాత్రం కొలిక్కిరాలేదు.
పరువు పోయిందని ఎంతపని చేశాడంటే ?
భర్త అరుణ్ కుమార్ అక్రమ సంబంధం విషయంలోనే ఇంటిలో లతా పెద్ద గొడవ చేసింది. ఆ సమయంలో ఇంటి లోపల తలుపుకు గడియ పెట్టిన అరుణ్ కుమార్, లతా, కుమార్తె అమృత పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకోవడంతో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అరుణ్ కుమార్ భార్య, కుమార్తెకు నిప్పంటి హత్య చేసి తరువాత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని లతా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పు చేసింది అరుణ్ కుమార్ అయినా భార్య వాడి పరువు తీసిందని ఆవేశంలో మొత్తం కుటుంబాన్ని అంతం చెయ్యడంతో చిత్రదుర్గ జిల్లాలోనే ఈ సంఘటన కలకలం రేపింది.