Illegal affair: భార్య కామానికి ఫ్యామిలీ మొత్తం బలి, వీడియో తీసి షేర్ చేసిన భర్త, తోటలో !
సేలం/ చెన్నై: డాబాలో వంట మాస్టర్ గా పని చేస్తున్న వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వంట మాస్టర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త ప్రతిరోజు డాబాలో పని చేసి ఇంటికి వస్తున్నాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత భార్య సెల్ ఫోన్ కు అంకితం అవుతోంది. ఇద్దరు పిల్లలను ఇంటిలో పెట్టి తాళం వేసి బయటకు వెలుతున్న భార్య, రెండు మూడు గంటల తరువాత ఇంటికి చేరుకునేది. ఇటీవల వంట చేస్తున్న సమయంలో వేడినీళ్లు కాళ్ల మీద పడటంతో భర్త పనికి వెళ్లకుండా ఇంటికే పరిమితం అయ్యాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ అతని భార్య గంటలు గంటలు వేరే వ్యక్తికి ఫోన్ చేసి నవ్వుతూ సెక్సీగా జోకు వేసి మాట్లాడుతోంది. ఎవరికి నువ్వు ఫోన్ చేశావు అంటూ నీకెందుకు అంటూ అతని భార్య రివర్స్ లో మాట్లాడటం మొదలుపెట్టింది. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఇంట్లో ఉన్న భర్తకు తెలిసిపోయింది. రాత్రి ఇద్దరు పిల్లలను పిలుచుకుని భార్య సెల్ ఫోన్ ఎత్తుకుని భర్త బయటకు వెళ్లిపోయాడు. నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుని మా పరువు తీసిందని, ఇప్పుడు అదే కారణంతో మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని, ఇక ముందు నా భార్య ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకోవచ్చని, అదే కదా ఆమె కోరుకుంటున్నది అంటూ వీడియో తీసి బంధువులు అందరికి పంపించాడు. చెట్టుకు ఇద్దరు పిల్లలకు ఉరి వేసిన అతను అదే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

వంట మాస్టర్ ఫ్యామిలీ
తమిళనాడులోని సేలం జిల్లాలోని మంగలపట్టి ప్రాంతంలో మురగన్ (33) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 15 సంవత్సరాల నుంచి డాబాలో వంట మాస్టర్ గా పని చేస్తున్న మురుగన్ 15 సంవత్సరాల క్రితం మురగేశ్వరి (30) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మురగేశ్వరి, మురుగన్ దంపతులకు శ్రీనివాసన్ (9) అనే కుమారుడు, క్రిష్ణప్రియా (5) అనే కుమార్తె ఉన్నారు.

స్టాఫ్ క్వాటర్స్ లో నివాసం
మురుగన్ పని చేస్తున్న డాబా యజమాని అక్కడ పని చేస్తున్న ఉద్యోగుల కోసం డాబా సమీపంలోనే క్వారాటర్స్ కట్టించాడు. డాబా కు కిలోమీటరు దూరంలోని క్వాటర్స్ లో మురగన్, మురగేశ్వరి దంపతులు వారి పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రతిరోజూ మురుగన్ డాబాలో పని చేసి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు.

మొబైల్ ఫోన్ కు అంకితం అయిపోతున్న భార్య
భార్య మురుగేశ్వరితో సంతోషంగా కాపురం చేస్తున్న ఆమె భర్త మురుగన్ ప్రతిరోజు డాబాలో పని చేసి ఇంటికి వస్తున్నాడు. భర్త మురుగన్ డాబాలో పని చెయ్యడానికి బయటకు వెళ్లిన తరువాత అతని భార్య మురగేశ్వరి సెల్ ఫోన్ కు అంకితం అయిపోయి గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతోంది. ఇద్దరు పిల్లలను ఇంటిలో పెట్టి తాళం వేసి బయటకు వెలుతున్న మురగేశ్వరి రెండు మూడు గంటల తరువాత ఇంటికి చేరుకునేదని సమాచారం.

వంటమాస్టర్ భార్యకు అక్రమ సంబంధం
మురగేశ్వరి ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో జల్సా చెయ్యడం మొదలు పెట్టింది. భర్త డాబాలో పని చెయ్యడానికి వెలితే అర్దరాత్రి మాత్రమే ఇంటికి వస్తాడని మురగేశ్వరికి ముందే తెలుసు. మురుగన్ డాబాలో పని చేస్తుంటే అతని భార్య మురగేశ్వరి ఆమె ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి చేరుకునేది.

అనారోగ్యానికి గురైన భర్త
10 రోజుల క్రితం డాబాలో వంట చేస్తున్న సమయంలో వేడినీళ్లు కాళ్ల మీద పడటంతో మురుగన్ పనికి వెళ్లకుండా ఇంటికే పరిమితం అయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న మురుగన్ ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ మురుగన్ భార్య మురగేశ్వరి గంటలు గంటలు ఆమె ప్రియుడికి ఫోన్ చేసి నవ్వుతూ సెక్సీగా జోకు వేసి మాట్లాడుతున్న విషయం ఆమె భర్త గర్తించాడు.

ఎదురు తిరిగిన భార్య
మురుగన్ కు అతని భార్య మురగేశ్వరి మీద పూర్తిగా అనుమానం వచ్చింది. ఎవరికి నువ్వు ఫోన్ చేశావు అంటూ మురుగన్ అతని భార్య మురగేశ్వరిని ప్రశ్నించాడు. ఎవరితో మాట్లాడితే నీకెందుకు అంటూ మురగేశ్వరి రివర్స్ లో మాట్లాడటం మొదలుపెట్టింది. తన భార్య మురగేశ్వరి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఇంట్లోనే పూర్తి సమయం ఉంటున్న ఆమె భర్త మురుగన్ కు తెలిసిపోయింది.

పిల్లలను పిలుచుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు
రాత్రి కొడుకు, కూతురిని పిలుచుకుని భార్య మురగేశ్వరి సెల్ ఫోన్ ఎత్తుకున్న ఆమె భర్త మురుగన్ తాను డాబా దగ్గరకు వెలుతున్నానని భార్యకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తరువాత నా భార్య మురగేశ్వరి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని మా పరువు తీస్తోందని, ఇప్పుడు అదే కారణంతో మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని మురుగన్ ఓ వీడియో తీశాడు,

వీడియోలో మొత్తం భార్య స్టోరీ చెప్పిన భర్త
ఇక ముందు నా భార్య మురగేశ్వరి ఆమె ప్రియుడితో బయట తిరుగుతూ ఎంజాయ్ చేసుకోవచ్చని, గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకోవచ్చని, అదే కదా ఆమె కోరుకుంటున్నది అంటూ వీడియో తీసిన మురుగన్ అతని బంధువులు అందరికి పంపించాడు. తరువాత ఆర్ టీఓ సమీపంలోని కల్యాణమండపం వెనుక ఉన్న మామిడి తోటలోని మామిడి చెట్టుకు ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపేసిన మురుగన్ అదే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య కామానికి ఫ్యామిలీ మొత్తం బలి
మురుగన్ ఆత్మహత్య చేసుకుంటున్నాడని వీడియో చూసి విషయం తెలుసుకున్న బంధువులు, పోలీసులు గాలించగా మరుసటి రోజు మామిడి తోటలో మురుగన్, అతని ఇద్దరు పిల్లలు ఒకే చెట్టుకు శవమై కనిపించడం కలకలం రేపింది. భార్య మురగేశ్వరి అక్రమ సంబంధం కారణంగా ఆమె భర్త, ఇద్దరు పిల్లలు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం సేలంలో కలకలం రేపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications