Illegal affair: పనోడితో కౌన్సిలర్ భార్య ?, స్లోపాయిజన్, సాంబార్ స్కెచ్, డౌట్ రాకుండా, ఫినిష్ !
చెన్నై/నాగపట్టణం: ప్రముఖ రాజకీయ పార్టీలో చురుకుగా పని చేస్తున్న వ్యక్తి స్థానికంగా పలుకుబడి పెట్టుకున్నాడు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఆ రాజకీయ నాయకుడు ఇప్పుడు సొంత పార్టీ అధికారంలోకి రావడంతో ఎక్కువ బిజీగా ఉంటున్నాడు. అధికార పార్టీకి చెందిన ఆ నాయకుడు కౌన్సిలర్. కౌన్సిలర్ అతని భార్యతో కలిసి ఉంటున్నాడు. కౌన్సిలర్ ఇంట్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మగాళ్లు పని చేస్తున్నారు. గత ఆరు నెలల నుంచి ఆ కౌన్సిలర్ అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇటీవల ప్రముఖ ఆసుపత్రిలో రెండు వారాలకు పైగా అడ్మిట్ అయ్యి చికిత్స పోందిన ఆయన తరువాత డిశ్చార్జీ అయ్యి ఇంటికి చేరుకున్నాడు. 10 రోజుల తరువాత మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స విఫలమై కౌన్సిలర్ చనిపోయాడు. తరువాత కుటుంబ సభ్యులు కౌన్సిలర్ అంత్యక్రియలు పూర్తి చేశారు. భర్త చనిపోయాడని ఏమాత్రం బాధలేకుండా అతని భార్య నిత్యం ఫోన్ లో కిలకిలా నవ్వుతూ మాట్లాడుతోందని కౌన్సిలర్ బంధువు గమనించాడు. అంతే భార్య మొబైల్ ఫోన్ పరిశీలించడంతో ఆమె ఎక్కువగా కౌన్సిలర్ ఇంట్లో పని చేస్తున్న వ్యక్తితో మాట్లాడుతోందని వెలుగు చూసింది. కౌన్సిలర్ ఇంట్లో పని చేస్తున్న వ్యక్తిని పోలీసులు బెండ్ తీస్తే అప్పుడు అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. కౌన్సిలర్ ను అతని భార్య ఎలా సాంబార్ స్కెచ్ తో చంపేసింది అనే విషయం బయటకు రావడంతో అందరూ హడలిపోయారు.
Video call: భార్య ప్రియుడికి ఆటైపులో వీడియో కాల్ చేసింది, భర్తకు తెలిసింది, భర్త దెబ్బకు భార్య!
అధికార పార్టీ నాయకుడు
తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని వేలంగాణి సమీపంలోని సడయంకాడు ప్రాంతంలో దేవేంద్రన్ (46) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. డీఎంకే పార్టీలో చురుకుగా పని చేస్తున్న దేవేంద్రన్ స్థానికంగా పలుకుబడి పెట్టుకున్నాడు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకుడు దేవేంద్రన్ ఇప్పుడు సొంత పార్టీ డీఎంకే తమిళనాడులో అధికారంలోకి రావడంతో ఎక్కువ బిజీగా ఉంటున్నాడు.
జిల్లా నాయకుడు, కౌన్సిలర్
కొన్ని సంవత్సరాల క్రితం దేవేంద్రన్ అతనికంటే వయసులో తక్కువ వయసు ఉన్న సూర్యా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. నాగపట్టణం జిల్లా డీఎంకే పార్టీ కార్యదర్శిగా పని చేస్తున్న దేవేంద్రన్ కౌన్సిలర్ గా గెలుపొందాడు. తమిళనాడలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి చెందిన జిల్లా నాయకుడు, కౌన్సిలర్ దేవేంద్రన్ అతని భార్య సూర్యాతో కలిసి ఉంటున్నాడు.
అనారోగ్యంతో ఆసుపత్రులు తిరుగుతున్న లీడర్
గత ఆరు నెలల నుంచి కౌన్సిలర్ దేవేంద్రన్ అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. డిసెంబర్ 15వ తేదీన తిరుచ్చిలోని ప్రముఖ పైవేట్ ఆసుపత్రిలో రెండు వారాలకు పైగా అడ్మిట్ అయ్యి చికిత్స పోందిన దేవేంద్రన్ తరువాత కొలుకుని డిశ్చార్జీ అయ్యి ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి దేవేంద్రన్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఆసుపత్రిలో ప్రాణం పోయింది
కౌన్సిలర్ దేవేంద్రన్ ఇంట్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మగాళ్లు పని చేస్తున్నారు. జనవరి 4వ తేదీన ఇంట్లో ఉన్న దేవంద్రన్ మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో తిరుచ్చిలోని అదే ఆసుపత్రిలో చేరాడు. ఆ సమయంలో జాండిస్ తో బాధపడుతున్న దేవేంద్రన్ ను కావేరీ ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. అయితే చికిత్స విఫలమై జనవరి 6వ తేదీన దేవేంద్రన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
హడావిడిగా అంత్యక్రియలు
ఆసుపత్రి నుంచి దేవంద్రన్ శవాన్ని సొంత ఊరికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు తరువాత హడావిడిగా అంత్యక్రియలు పూర్తి చేశారు. దేవేంద్రన్ అంత్యక్రియలు చేసే సమయంలో అతని భార్య సూర్యా ఆర్తనాదాలు చేసింది. దేవేంద్రన్ అనారోగ్యంతో చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. దేవేంద్రన్ భార్య సూర్యా మీద ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాలేదు.
భర్త చనిపోయాడని బాధలేదు.... ఫోన్ కు అంకితం అయిపోయిన భార్య
భర్త దేవేంద్రన్ చనిపోయాడని ఏమాత్రం బాధలేకుండా అతని భార్య సూర్యా కొన్ని రోజుల నుంచి నిత్యం ఫోన్ లో కిలకిలా నవ్వుతూ మాట్లాడుతోందని కౌన్సిలర్ బంధువు సతీష్ కన్నన్ గమనించాడు. అంతే సతీష్ కన్నన్ కౌన్సిలర్ దేవేంద్రన్ భార్య సూర్యా మొబైల్ ఫోన్ ను సీక్రేట్ గా పరిశీలించడంతో ఆమె ఎక్కువగా కౌన్సిలర్ ఇంట్లో పని చేస్తున్న చంద్రశేఖరన్ (33) అనే వ్యక్తితో మాట్లాడుతోందని వెలుగు చూసింది.
పనిమనిషితో కౌన్సిలర్ భార్య అక్రమ సంబంధం
దేవేంద్రన్ బంధువులు కొందరు చంద్రశేఖరన్ ను పట్టుకుని చితకబాదేశారు. ఆ సమయంలో దేవేంద్రన్ భార్య సూర్యాతో తనకు అక్రమ సంబంధం ఉందని, కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరు ఎవ్వరికీ తెలీకుండా ఇంట్లో సరదాగా గడుపుతున్నామని చంద్రశేఖర్ బయటకు చెప్పడంతో దేవేంద్రన్ కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు.
ఇష్టం లేని పెళ్లి చేసుకుంది
పేద కుటుంబానికి చెందిన సూర్యాను ఆమెకు ఇష్టం లేకపోయినా దేవేంద్రన్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఇంట్లో గత 15 ఏళ్లుగా పని చేస్తున్న చంద్రశేఖర్ తో సూర్యా చనువు పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన దేవేంద్రన్ భార్య సూర్యాను మందలించాడు.
సాంబార్ స్కెచ్ వేసిన భార్య
భర్త దేవంద్రన్ ను ఒకేసారి చంపేస్తే కేసు అవుతుందని సూర్యా, ఆమె ప్రియుడు చంద్రశేఖర్ భయపడ్డారు. అందుకే దేవంద్రన్ ఎక్కువగా ఇష్టపడి తింటున్న సాంబార్ లో అతని భార్య సూర్యా ఏడాది నుంచి కొంచెం కొంచెం విషయం కలుపుతూ వచ్చిందని, ఆ విషం దేవేంద్రన్ శరీరంలోకి కలిసిపోయి నిత్యం అనారోగ్యానికి గురౌతు వచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
స్లోపాయిజన్ తో భర్తను లేపేసింది
భర్త దేవేంద్రన్ ను స్లోపాయిజన్ ఇచ్చి చంపేస్తే ఎలాంటి కేసు ఉండదని అతని భార్య సూర్యా, ప్రియుడు చంద్రశేఖరన్ స్కెచ్ వేసి అనుకున్నట్లే చంపేశారని పోలీసులు అన్నారు. భర్త దేవేంద్రన్ ను సాంబార్ స్కెచ్ తో చంపేసిన అతని భార్య సూర్యా, ఆమె ప్రియుడు చంద్రశేఖరన్ ను అరెస్టు చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.