Illegal affair: ప్రియుడే జీవితం, హోటల్ ఫుడ్ ఉంటే ఇంట్లో ఫుడ్ ఎందుకు ?, భార్య ప్లాన్ 100% రివర్స్ !
బెంగళూరు/మంగళూరు: కుటుంబ సభ్యుల చూసిన యువకుడిని వివాహం చేసుకున్న మహిళ భర్తతో చక్కగానే కాపురం చేసింది. ఉద్యోగం చేస్తున్న భర్త సిటీ సమీపంలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు. ఇదే సమయంలో భార్య గర్బవతి కావడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. పుట్టింటిలో ఉంటున్న భార్యకు పాత ప్రియుడు టచ్ లోకి వచ్చాడు. భర్త పాటికి భర్త ఉద్యోగం చేసుకుంటుంటే పుట్టింటిలో ఉన్న భార్య ఆమె ప్రియుడితో మస్త్ మజా చేసింది. పాపను తీసుకుని ఇంటకి ఎప్పుడు వస్తావని భర్త అడిగితే ఏదో ఒక సినిమా స్టోరీ చెబుతున్న భార్య రెండు సంవత్సరాలు కాలం గడిపేసింది. తన భార్య కాపురానికి రమ్మని చెబితే ఎందుకు రాను అని మొండికి వేస్తోందని అనుమానం రావడంతో భర్త ఆరా తీశాడు.
పుట్టింటిలో ఉంటున్న భార్య ప్రియుడితో కలిసి జల్సా చేసోందని భర్తకు తెలిసింది. ఇంట్లో ఫుడ్ అయినా, హోటల్ ఫుడ్ అయినా కడుపు నిండిపోతుంది కదా అని భార్య అనుకుంది. భర్త లేకున్నా ప్రియుడితో సుఖపడుతున్నాము కదా ?, ఇంక ఎందుకు అక్కడికి వెళ్లాలి అంటూ పుట్టింటిలోనే భార్య కాలం గడిపేసింది. నీ భర్తను చంపేస్తే మనం సుఖంగా ఇక్కడే ఉండటానానికి చాన్స్ చిక్కుతుందని, ఆలోచించాలని ప్రియుడు అతని ప్రియురాలికి మాయమాటలు చెప్పాడు. ప్రియుడి మోజులో పీకలలోతు కూరుకుపోయిన భార్య భర్తను చంపడానికి డిసైడ్ అయ్యింది. భర్తను పుట్టింటికి పిలిపించుకున్న భార్య ప్రియుడితో కలిసి అతన్ని పక్కాప్లాన్ తో చంపేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి కోర్టు యావజ్జీవ కారగార శిక్ష విధించింది. ప్రియుడితో జల్సా చెయ్యాలని అనుకున్న భార్య, ఆమె ప్రియుడి ప్లాన్ 100 % రివార్స్ కావడంతో ఇప్పుడు జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి ఎదురైయ్యింది.

భర్తతో హ్యాపీలైఫ్
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని బంట్వాళ తాలుకా కదిల గ్రామంలో జయరామ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడుబిదిరె కుక్కదకట్ట సమీపంలోని మూడుకోణేజ గ్రామంలో నివాసం ఉంటున్న మమతా అలియాస్ అశ్వినీ అనే యువతిని 2014లో జయరామ్ వివాహం చేసుకున్నాడు.

మంగళూరులో భర్త ఉద్యోగం
కుటుంబ సభ్యుల చూసిన జయరామ్ అనే యువకుడిని వివాహం చేసుకున్న అశ్వినీ భర్తతో చక్కగానే కాపురం చేసింది. మంగళూరులో ఉద్యోగం చేస్తున్న భర్త జయరామ్ మంగళూరుసిటీ సమీపంలోపి మూడబిదరి ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని భార్య అశ్వినీతో కాపురం పెట్టాడు. ఇదే సమయంలో భార్య అశ్వినీ గర్బవతి కావడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది.

టచ్ లోకి వచ్చిన పాత ప్రియుడు
జయరామ్ తో వివాహం చేసుకోకముందే ఆమె పుట్టింటి సమీపంలో నివాసం ఉంటున్న ఆనంద మేర అలియాస్ ఆనంద అనే యువకుడితో అశ్వినీకి పరిచయం ఉంది. వివాహం కాకముందే అశ్వినీతో ఆనంద పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. ప్రియుడు ఆనంద్ విషయం దాచిపెట్టిన అశ్వినీ కుటుంబ సభ్యులు జరామయ్ తో ఆమె వివాహం జరిపించేశారు. కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన అశ్వినీకి పాత ప్రియుడు ఆనంద్ టచ్ లోకి వచ్చాడు.

ప్రియుడితో జల్సా చేసిన భార్య
కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన అశ్వినీ 2015లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్త జయరామ్ అతని పాటికి అతను మంగళూరులో ఉద్యోగం చేసుకుంటుంటే పుట్టింటిలో ఉన్న భార్య అశ్వినీ ఆమె ప్రియుడు ఆనంద్ తో మస్త్ మజా చేసింది. పాపను తీసుకుని ఇంటకి ఎప్పుడు వస్తావని భర్త జయరామ్ అడిగితే ఏదో ఒక సినిమా స్టోరీ చెబుతున్న అశ్వినీ పుట్టింటిలోనే ఉంటూ ప్రియుడు ఆనందతో జల్సా చేస్తూ కాలం గడిపేసింది.

భర్తకు అనుమానం వచ్చి ఆరా తీశాడు
తన భార్య అశ్విని కాపురానికి రమ్మని పదేపదే చెప్పినా ఎందుకు రాను అని మొండికి వేస్తోందని ఆమె భర్త జయరామ్ కు అనుమానం రావడంతో ఆరా తీశాడు. ఒకసారి భార్య అశ్వినీకి సమాచారం ఇవ్వకుండానే జయరామ్ ఆమె పుట్టింటి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో కూతురిని తల్లిదండ్రుల దగ్గర వదిలేసిన అశ్వినీ ప్రియుడు ఆనంద్ తో జల్సా చెయ్యడానికి వెళ్లిపోయింది.

సినిమా స్టోరీలు చెప్పిన భార్య
రెండు గంటల తరువాత అశ్వినీ ఇంటికి తిరిగి వెళ్లి అక్కడ భర్త జయరామ్ ఉండటం చూసి షాక్ అయ్యింది. బంధువుల ఇంటికి వెళ్లానని, అక్కడ ఆలస్యం అయ్యిందని ఆ రోజు అశ్వినీ ఆమె భర్త జయరామ్ కు మాయమాటలు చెప్పింది. పుట్టింటిలో ఉంటున్న తన భార్య అశ్విని ఆమె పాత ప్రియుడు ఆనంద్ తో కలిసి జల్సా చేసోందని భర్త జయరామ్ కు తెలిసింది.

హోటల్ ఫుడ్ అయినా, ఇంట్లో ఫుడ్ అయినా కడుపు నిండిపోతుంది కదా ?
ఇంట్లో ఫుడ్ అయినా, హోటల్ ఫుడ్ అయినా కడుపు నిండిపోతుంది కదా, భర్త జయరామ్ తో అయినా, ప్రియుడు ఆంనదతో అయినా సరే, ఎవరితో కాపురం చేసినా నా పని పూర్తి అయిపోతుంది కదా అని అశ్వినీ అనుకుంది. భర్త లేకున్నా ప్రియుడు ఆనందతో సుఖపడుతున్నాము కదా ?, ఇంక ఎందుకు అక్కడికి వెళ్లాలి అంటూ అశ్వినీ పుట్టింటిలోనే కాలం గడిపేసింది.

ప్రియుడికి క్రిమినల్ మైండ్
నీ భర్త జయరామ్ ను చంపేస్తే మనం సుఖంగా ఇక్కడే ఉండటానానికి చాన్స్ చిక్కుతుందని, ఆలోచించాలని ప్రియుడు ఆనంద అతని ప్రియురాలు అశ్వినీకి మాయమాటలు చెప్పాడు. ప్రియుడు ఆనంద మోజులో పీకలలోతు కూరుకుపోయిన భార్య అశ్వినీ ఆమె భర్తను చంపడానికి డిసైడ్ అయ్యింది.

పక్కాప్లాన్ తో భర్త హత్య
2018 సెప్టెంబర్ 13వ తేదీన భర్త జయరామ్ ను పుట్టింటికి పిలిపించుకున్న భార్య అశ్వినీ అతనితో గొడవ పెట్టుకునింది. ఆ సమయంలో అశ్వినీ ప్రియుడు ఆనంద వెళ్లి జయరామ్ తల మీద ఇనుప రాడ్ లతో దాడి చేసి అతన్ని పక్కాప్లాన్ తో చంపేశారు. జయరామ్ శవాన్ని గోనే సంచిలో మూటకట్టి దానిని మూడబిదిరే స్కూల్ కాంపౌండ్ సమీపంలో విసిరేశారు. జయరామ్ సోదరుడు గిరీష్ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది.

భార్య, ప్రియుడికి యావజ్జీవ శిక్ష
మూడబిదరి ఇన్స్ పెక్టర్ రామచంద్ర కేసు నమోదు చేసి అశ్వినీ, ఆమె ప్రియుడు ఆనందను అప్పట్లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి మంగళూరు 3వ అడిషినల్ కోర్టులో జయరామ్ హత్య కేసు విచారణ జరుగుతోంది. జయరామ్ ను అతని భార్య అశ్వినీ, ఆమె ప్రియుడు ఆనంద హత్య చేశారని రుజువు కావడంతో న్యాయమూర్తి బసప్ప బాలప్ప నిందితులు ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 5,000 జరిమానా విధించారు. భర్త జయరామ్ హత్య కేసులో అతని భార్య, అశ్వినీ, ఆమె ప్రియుడు ఆనంద జైలుపాలు అయ్యారు. ప్రియుడు ఆనందతో జల్సా చెయ్యాలని అనుకున్న భార్య అశ్వినీ, ఆమె ప్రియుడు ఇప్పుడు జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి ఎదురైయ్యింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications