Illegal affair: బలిసిన ఆంటీతో భర్త ఎంజాయ్, వడ్డీవ్యాపారి హత్యకు భార్య స్కెచ్, కాలేజ్ స్టూడెంట్ !
కోయంబత్తూరు/ చెన్నై: వడ్డీ వ్యాపారం చేస్తున్న ఓ ఫైనాన్సియర్ భారీగానే డబ్బులు సంసాదిస్తున్నాడు. అవసరం ఉన్న వారికి డబ్బులు ఇస్తూ వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారి అతని భార్యకు ఏమికావాలన్నా చూసుకునేవాడు. వడ్డీ వ్యాపారం చేస్తున్న అతనికి అనేక మంది మహిళలతో పరిచయం అయ్యింది. ఇదే సమయంలో నాటుకోడి లాంటి ఆంటీ పరిచయం కావడంతో ఆమెతో వడ్డీ వ్యాపారి సన్నిహితంగా మెలగడం మొదలు పెట్టాడు. వడ్డీవ్యాపారి బలిసిన నాటుకోడి ఆంటీ అక్రమ సంబంధం పెట్టుకుని విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. రానురాను వడ్డీ వ్యాపారి ఆంటీ ఇంటిలో ఎక్కువగా ఉంటూ ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. వడ్డీ వ్యాపారంలో సంపాధిస్తున్న డబ్బులు ఎక్కువగా ఆంటీకి ఇస్తున్న ఆ వ్యాపారి అతని భార్యను నిర్లక్షం చేస్తూ వచ్చాడు. ఇదే విషయంలో వడ్డీ వ్యాపారి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్త తీరుతో విసిగిపోయిన భార్య అతన్ని చంపించడానికి స్కెచ్ వేసింది. తెలిసిన యువకులకు కిరాయి ఇచ్చిన భార్య వడ్డీ వ్యాపారి హత్యకు పక్కా స్కెచ్ వేసింది. కాలేజ్ విద్యార్థిని రంగంలోకి దింపిన భార్య పక్కాప్లాన్ తో ఆమె భర్తను వేటకొడవళ్లు, కత్తులతో నరికించడం కలకలం రేపింది.
Illegal affair: కూతురి మొగుడితో అత్త ఫుల్ రొమాన్స్, ఫ్యామిలీ దెబ్బతో అల్లుడు ఫినిష్, ఐదు మంది !
ఫేమస్ వడ్డీవ్యాపారి
తమిళనాడులోకి కోయంబత్తూరులోని సూలూరు ప్రాంతంలో సుబ్రమణ్యం (52), తిలగవతి (48) దంపతులు నివాసం ఉంటున్నారు. సుబ్రమణ్యం వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. వడ్డీ వ్యాపారం చేస్తున్న ఫైనాన్సియర్ సుబ్రమణ్యం భారీ మొత్తంలో వడ్డీలకు ఇచ్చి బాగానే డబ్బులు సంసాదిస్తున్నాడు. అవసరం ఉన్న వారికి డబ్బులు ఇస్తూ వడ్డీలు వసూలు చేస్తున్న సుబ్రమణ్యం అతని భార్య తిలగవతికి ఇంతకాలం ఏమి కావాలన్నా అన్నీ చూసుకునేవాడు.
బలంగా ఉన్న నాటుకోడి ఆంటీ ఎంట్రీ
వడ్డీ వ్యాపారం చేస్తున్న సుబ్రమణ్యంకు అనేక మంది మహిళలతో పరిచయం అయ్యింది. ఇదే సమయంలో తమిళనాడులోని విరూద్ నగర్ కు చెందిన బలంగా బలిసిన నాటుకోడి లాంటి సరోజా ఆంటీ పరిచయం కావడంతో ఆమెతో వడ్డీ వ్యాపారి సుబ్రమణ్యం చాలా సన్నిహితంగా మెలగడం మొదలు పెట్టాడు.
ఆంటీతో అక్రమ సంబంధం
వడ్డీవ్యాపారి సుబ్రమణ్యం బలిసిన నాటుకోడి ఆంటీ సరోజాతో అక్రమ సంబంధం పెట్టుకుని విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడంటే అప్పుడు తాను వడ్డీ వసూలు చెయ్యడానికి బయట ఊర్లకు వెలుతున్నానని భార్య తిలగవతికి చెప్పి వెలుతున్న సుబ్రమణ్యం విరూద్ నగర్ కు వెళ్లి ప్రియురాలు సరోజాతో విహారయాత్రలకు వెళ్లి ఆమెతో స్వర్గం చూస్తున్నాడు.
భార్యకు హ్యాండ్ ఇచ్చేశాడు
రానురాను వడ్డీ వ్యాపారి సుబ్రమణ్యం అతని ప్రియురాలు సరోజా ఆంటీ ఇంటిలో ఎక్కువగా ఉంటూ ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఇంతకాలం భార్య తిలగవతిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్న సుబ్రమణ్యం ఆమెను పట్టించుకోవడం మానేసి భార్య విషయంలో నిర్లక్షంగా ఉండటం మొదలుపెట్టాడు. ప్రియురాలు సరోజాకు మాత్రం లక్షలు లక్షలు ఇస్తున్న సుబ్రమణ్యం పూర్తిగా ఆమె వ్యామోహంలో పడిపోయాడని సమాచారం.
భర్త హత్యకు స్కెచ్ వేసిన భార్య
తన భర్త సుబ్రమణ్యం ఎందుకు తనను పట్టించుకోవడంలేదని తిలగవతి ఆరా తీసింది. ఇదే సమయంలో తన భర్త సుబ్రమణ్యం కిలాడీ సరోజాను తగులుకున్నాడని తిలగవతికి తెలిసింది. ఇదే విషయంలో వడ్డీ వ్యాపారి సుబ్రమణ్యం, తిలగవతి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్త సుబ్రమణ్యం తీరుతో విసిగిపోయిన అతని భార్య తిలగవతి అతన్ని చంపించడానికి స్కెచ్ వేసింది.
భర్త హత్యకు యువకులు ఎంట్రీ
తిలగవతి భర్త సుబ్రమణ్యం దగ్గర నిత్యం తమిళనాడులోని మదురైలోని అవనియపురంలో నివాసం ఉంటున్న భవన నిర్మాణ కాంట్రాక్టర్ వేలాయుధమూర్తి (28) వడ్డీకి డబ్బులు తీసుకుంటున్నాడు. మూర్తి కూడా తిలగవతికి బాగా తెలుసు. తిలగవతి కూడా మూర్తితో సన్నిహితంగా ఉండేదని సమాచారం. ఇదే సమయంలో మూర్తితో మాట్లాడిన తిలగవతి తన భర్త సుబ్రమణ్యంను చంపేయాలని చెప్పింది. భర్త సుబ్రమణ్యంను హత్య చెయ్యడానికి తిలగవతి మూర్తికి రూ. 50,000 అడ్వాన్స్ ఇచ్చింది.
బంధువు, కాలేజ్ యువకులు ఎంట్రీ
తిలగవతి దగ్గర రూ. 50 వేలు తీసుకున్న మూర్తి అతని బంధువు ప్రభాకరన్, కాలేజ్ లో చదువుతున్న తిరుప్పూర్ కు చెందిన కమల్ కుమార్ (21), ప్రభాకరన్ (19) అనే యువకులు సహాయం తీసుకున్నాడు. తరువాత పక్కాప్లాన్ తో మూర్తి వడ్డీవ్యాపారి సుబ్రమణ్యంను నమ్మించి సెప్టెంబర్ 3వ తేదీన రాత్రి తెన్నంపాలయం- అన్నూర్ రహదారిలోని ఓ హోటల్ దగ్గరకు పిలుచుకుని వెళ్లారు.
వడ్డీవ్యాపారిని హోటల్ లో వేటకోడవళ్లతో నరికేశారు
వడ్డీవ్యాపారి సుబ్రమణ్యం, మూర్తి హోటల్ లో ఉన్న సమయంలో ప్రభాకరన్, కమల్ కుమార్ వేటకోడవళ్లు తీసుకుని అతన్ని ఇష్టం వచ్చినట్లు నరికేశారు. సుబ్రమణ్యం ప్రాణాలుపోయాయని అతన్ని వదిలేసి వెళ్లిపోయారు. తీవ్రగాయాలైన సుబ్రమణ్యంను ఆసుపత్రికి తరలించారు. ఆర్థికలావాదేవీల కారణంగా సుబ్రమణ్యంను మీద వేటకోడవళ్లతో చంపడానికి ప్రయత్నించారని అతని భార్య తిలగవతి పోలీసులకు చెప్పింది.
Recommended Video
గంటకు ఒక మాటమార్చిన భార్య
పోలీసుల విచారణలో తిలగవతి గంటకు ఒక మాట మార్చడంతో పోలీసు అధికారులకు అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. ఆ సమయంలో తన భర్త సుబ్రమణ్యం కిలాడి సరోజా మోజులో పడిపోయి డబ్బులు మొత్తం ఆమెకు తగలేస్తున్నాడని, అందుకే కిరాయి ఇచ్చి చంపించడానికి ప్రయత్నించానని తిలగవతి అంగీకరించిందని పోలీసు అధికారులు అన్నారు. తిలగవతితో పాటు మూర్తి, ప్రభాకరన్, కమల్ కుమార్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.