అయోధ్యలో తమ స్థలంలో మసీదు నిర్మాణానికి ఆలయ ట్రస్ట్ అంగీకారం
అయోధ్య: అయోధ్యలోని శిథిలావస్థలో ఉన్న మసీదు నిర్మాణానికి హిందువులు ముందుకు వచ్చారు. మూడు వందల ఏళ్ళనాటి ఆలంగిరి మసీదు పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు స్థానిక పురపాలక సంఘం నోటీసులు ఇచ్చింది. దీనిలోనికి ఎవరూ ప్రవేశించవద్దని చెప్పింది.
మొఘలు చక్రవర్తి ఔరంగజేబు అనుమతితో పదిహేడో శతాబ్దంలో ఈ మసీదును నిర్మించారు. ఈ మసీదు ప్రాంతం.. హనుమాన్గర్హి దేవాలయ స్వాధీనంలో ఉంది. ఈ మసీదు శిథిలావస్థలో ఉండటంతో చాలాకాలం నుంచి ఇక్కడ నమాజు జరగడం లేదు.

స్థానిక ముస్లీంలు హనుమాన్గర్హి దేవాలయం ప్రధాన పూజారి మహంత్ జ్ఞాన్ దాస్ను కలిశారు. మసీదు పునర్నిర్మాణానికి సహకరించాలని కోరారు. దీంతో ఆలయ ట్రస్ట్ ఈ ఆలయం సమీపంలో దానిని పునర్ నిర్మించాలని నిర్ణయించారు.
పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చులను భరిస్తామని దేవాలయం ట్రస్ట్ తెలిపింది. మహంత్ మాట్లాడుతూ.. మసీదును పునర్నిర్మించుకోవచ్చునని, అందుకు అయ్యే ఖర్చులు భరిస్తామని ముస్లిం సోదరులకు చెప్పానని తెలిపారు. ఇది కూడా దేవుడి ఆలయమే కాబట్టి, నమాజు చేసుకొనేందుకు అభ్యంతరం లేదన్నారు. తాను రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇస్తుంటానని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications