బ్యాంకుల రుణాల ఎగవేత, ఆర్థిక మోసాలు: కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: వరుస బ్యాంక్ రుణాల ఎగవేత కేసులు, ఆర్థిక మోసాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ 50 కోట్ల పైబడిన రాని బాకీలపై దృష్టి సారించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక శాఖ కోరింది.
రుణాలు తీసుకున్న వారు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినట్టు గమనిస్తే దర్యాప్తు ఏజెన్సీల సహకారం తీసుకోవాలని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్కుమార్ బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకు మోసాలు, ఉద్దేశపూరిత ఎగవేతలను ఎప్పటికప్పుడు గుర్తించి, ఆయా కేసులను సీబీఐకి నివేదించాలని కోరారు.
PSB MDs directed to detect bank frauds & consequential wilful default in time & refer cases to CBI. To examine all NPA accounts > Rs. 50Cr for possible fraud. Involve ED/DRI for PMLA/FEMA/EXIM violations if any. #EASE #NewIndia @FinMinIndia @PMOIndia @PIB_India pic.twitter.com/ZURiWu4D5T
— Rajeev kumar (@rajeevkumr) February 27, 2018
నిరర్థక ఆస్తులుగా మారిన ఖాతాలకు సంబంధించి సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి బ్యాంకులు రుణగ్రహాత స్టేటస్ రిపోర్టును పొందాలని సూచించారు. అంతేగాక, నిర్వహణ సవాళ్లు, సాంకేతిక రిస్క్లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యేలా ప్రభుత్వ రంగ బ్యాంకులు 15 రోజుల్లోగా బ్లూప్రింట్ను రూపొందించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పీఎస్యూ బ్యాంకులకు స్పష్టం చేసింది.