ఆ కీలక ప్రాంతంలో ఇంకా అలాగే: ఈ సారి ఛాన్స్ తీసుకున్న చైనా: తమ భూభాగంపై: కాస్సేపట్లో చర్చలు
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద మూడు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితులను పూర్తిగా చల్లార్చే దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. సరిహద్దు వివాదంపై చైనాతో మరోసారి చర్చలకు సిద్ధపడింది. ఈ రెండు దేశాల మధ్య లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల భేటీ కాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. వాస్తవాధీన రేఖకు అవతల చైనా భూభాగంపై గల మోల్డోలో ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. మోల్డోలోని బోర్డర్ ఆర్మీ పర్సనల్స్ మీటింగ్ పాయింట్ వద్ద రెండు దేశాల కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారులు చర్చల్లో పాల్గొంటారు.
వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నెలకొన్న తరువాత చేపట్టిన చర్చల పరంపరలో ఇది అయిదో సమావేశం. ఇప్పటికే నాలుగు దశల్లో చర్చలు అర్ధాంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. చివరి రెండు సమావేశాలు కూడా భారత భూభాగంపై గల ఛుసుల్లో ఏర్పాటు అయ్యాయి. ఈ సారి చైనా.. తమ భూభాగంపై గల మోల్డోలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవాధీన రేఖ సమీపంలో వివాదాస్పద ప్రాంతాలను చైనా సైనికులు ఖాళీ చేశారు. వాస్తవాధీన రేఖ నుంచి సుమారు రెండుకిలోమీటర్ల దూరం మేరకు వెనక్కి వెళ్లారు. యుద్ధ సామాగ్రిని సైతం వెనక్కి తరలించారు. తాత్కాలిక శిబిరాలను తొలగించారు.

గాల్వన్ వ్యాలీ సమీపంలో మాత్రమే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు వెనక్కి మళ్లాయి. వాస్తవాధీన రేఖ వెంబడి లఢక్ తూర్పు ప్రాంతాన్ని చైనా బలగాలు ఇంకా పూర్తిగా ఖాళీ చేయలేదని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. కిందటి నెల 30వ తేదీన తూర్పు లఢక్ ప్రాంతాన్ని ఖాళీ చేసినట్లు చైనా సైన్యం వెల్లడించినప్పటికీ.. అది వాస్తవం కాదని తమ పరిశీలనలో తేలిందని అంటున్నారు. అటు భౌగోళికంగా, ఇటు రక్షణపరంగా భారత్కు కీలకమైన పంగ్యంగ్ త్సో లేక్, డెప్సాంగ్ వంటి ఒకట్రెండు ప్రాంతాలను చైనా బలగాలు ఇంకా ఖాళీ చేయాల్సి ఉందని, ఫింగర్స్ పాయింట్ ప్రాంతాల్లోనూ చైనా బలగాల మోహరింపు కొనసాగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు.
Recommended Video
ఆయా ప్రాంతాలను ఖాళీ చేయించడమే ప్రధానంగా చర్చల అజెండాను రూపొందించినట్లు పేర్కొన్నారు. లఢక్లోని 14 కార్ప్స్ లెప్టినెంట్ కమాండర్ హర్వీందర్ సింగ్, పీఎల్ఏ తరఫున కమాండర్ లియు ఈ భేటీకి ప్రాతినిథ్యాన్ని వహించనున్నారు. ఇప్పటిదాకా నాలుగుసార్లు సమావేశాలను నిర్వహించినప్పటికీ.. చైన వెనక్కి తగ్గలేదు. ఈ సారి ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. నాలుగు విడతలుగా సుదీర్ఘకాలం పాటు రెండు దేశాల సైనికుల మధ్య చర్చలు కొనసాగినా.. చైనా తన బెట్టు వీడలేదని, అయిదో దఫా చర్చలను ఫలప్రదం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.
-
ఇరాన్ క్లోజ్.. హార్మూజ్ ఓపెన్.. చైనా హ్యాపీ: ట్రంప్ సంచలన ప్రకటన -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications