భారత్ లో కరోనా : 31 వేల కొత్త కేసులు, 318మరణాలు; అయినా రిలీఫ్ ఇస్తున్న రికవరీలు

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు మరణాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 31,382 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కాస్త కరోనా కేసులు తగ్గినట్లుగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 318 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు 4.46 లక్షల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరుకున్నాయి.

మూడు లక్షలకు క్రియాశీల కేసులు

మూడు లక్షలకు క్రియాశీల కేసులు

నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి బారినుండి 32,542 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 3.28 కోట్లకు చేరింది. ఇక క్రియాశీల కేసులు మూడు లక్షలకు తగ్గగా, క్రియాశీల కేసుల రేటు 0.89 శాతానికి పడిపోయింది. ఇక రికవరీ రేటు 97.78 శాతానికి పెరిగింది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నిన్న 72.2 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పంపిణీ అయిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 84.15 కోట్ల మార్కును దాటింది.

కేరళలో కరోనా పంజా .. మహారాష్ట్ర పరిస్థితి ఇలా

కేరళలో కరోనా పంజా .. మహారాష్ట్ర పరిస్థితి ఇలా

ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో 19,682 తాజా కేసులు మరియు 152 మరణాలు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న కేసులు దేశంలో కేసులు పెరగడానికి కారణం గా మారింది. కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,79,310 కాగా మరణాలు 24,191 కి చేరాయి. 3,320 కొత్త కేసులతో, మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 65,34,557 కి పెరిగింది. రాష్ట్రంలో 61 తాజా వైరస్ సంబంధిత మరణాలు కూడా నమోదయ్యాయి, మొత్తం మరణించిన వారి సంఖ్య 1,38,725 కి చేరుకుంది. మహారాష్ట్రలో ఇప్పుడు 39,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఒక్క కేరళ నుండే సగానికి పైగా కేసులు

ఒక్క కేరళ నుండే సగానికి పైగా కేసులు

గత వారం నివేదించబడిన మొత్తం ఇన్ఫెక్షన్లలో 62.73% కేరళ నుండి మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇది 1 లక్షకు పైగా కోవిడ్ కేసులు ఉన్న ఏకైక రాష్ట్రం. మరోవైపు, రోజువారీ పాజిటివిటీ రేటు - 100 కి గుర్తించబడిన పాజిటివ్ కేసుల సంఖ్య - రెండు శాతంగా ఉంది. గత 23 రోజులుగా ఇది మూడు శాతం కంటే తక్కువగా ఉంది. ఆరోగ్య అధికారుల ప్రకారం దేశంలోని ముప్పై మూడు జిల్లాలు ఇప్పుడు వారానికి 10 శాతం పైగా పాజిటివిటీ రేటును నివేదిస్తుండగా, 23 జిల్లాలు 5-10 శాతం మధ్య నమోదవుతున్నాయని వెల్లడిస్తున్నారు.

 వ్యాక్సినేషన్ లో పెద్దలకు 66 శాతం ఒక డోసు, 23 శాతం వ్యాక్సినేషన్ పూర్తి

వ్యాక్సినేషన్ లో పెద్దలకు 66 శాతం ఒక డోసు, 23 శాతం వ్యాక్సినేషన్ పూర్తి


ఇప్పటి వరకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా అర్హత ఉన్న వయోజన జనాభాలో 66 శాతం మందికి కనీసం ఒక మోతాదు కోవిడ్ -19 టీకా వేయించగా, 23 శాతం మంది పూర్తిగా టీకాలు వేయబడ్డారు. కరోనావైరస్ మహమ్మారికి ప్రతిస్పందన విషయంలో భారతదేశం చేసిన పనిని మరే ఇతర దేశం చేయలేకపోయిందని సుప్రీం కోర్టు గురువారం ప్రభుత్వాన్ని ప్రశంసించింది. కరోనా సోకి మృతి చెందిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కొంత ఊరట అని అభిప్రాయపడ్డారు న్యాయమూర్తులు.

 ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల లెక్క ఇదే

ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల లెక్క ఇదే

ఇదిలా ఉంటే చైనాలో డిసెంబర్ 2019 లో వ్యాప్తి చెందినప్పటి నుండి కరోనావైరస్ కారణంగా మొత్తం ప్రపంచంలో 47,05,691 మంది మరణించారు. అమెరికా 6,73,728 మరణాలతో అత్యంత ప్రభావిత దేశంగా మారింది. బ్రెజిల్ 5,92,964 మరణాలలో రెండవ స్థానంలో ఉండగా, భారతదేశం 4,46,368 మరణాలతో మూడవ స్థానంలో ఉంది. మెక్సికో 272,580 మరణాలతో, రష్యా 2,01,445 మరణాలతో ఐదవ స్థానంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+