భారత్కు అవమానం, ప్రపంచ పటంలో పాక్ ఉండొద్దు: తొగాడియా
భువనేశ్వర్: పాకిస్థాన్ దేశంపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాక్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ను చూసేందుకు వెళ్లిన ఆయన తల్లి, భార్యతో పాకిస్థాన్ ప్రభుత్వం అమర్యాదగా వ్యవహరించిందని, వారిని అవమానించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది వారికి జరిగిన అవమానం కాదని, దేశంలోని కోట్లాది మంది తల్లులు, సోదరీమణులకు జరిగిన అవమానమని వ్యాఖ్యానించారు. దీనికి తగిన జవాబు చెబుతామని పేర్కొన్నారు. బుధవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో విశ్వహిందు పరిషత్ అంతర్జాతీయ సదస్సులో ప్రవీణ్ తొగాడియా మాట్లాడారు.

రానున్న రోజుల్లో పాకిస్థాన్పై భారత్ యుద్ధం ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఉండకుండా చేయాలని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఓరం, బీజేపీరాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.వి.సింగ్దేవ్ తదితరులు పాల్గొన్నారు.
-
మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది! -
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
భారత్లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!











Click it and Unblock the Notifications