Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

180 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై..!

బ్రిటిష్ కాలం నుంచి మన దేశంలో భాగమైన పోస్టు బాక్సులు ఇకపై కనుమరుగు కానున్నాయి. 1854లో ప్రవేశపెట్టబడిన ఈ పోస్టు బాక్సులు, గత 180 ఏళ్లుగా భారతీయులతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్నాయి. బంధువులకు, స్నేహితులకు రాసిన ఉత్తరాల నుంచి అభిమాన రచయితలకు రాసిన లేఖల వరకు... అన్నీ ఈ పోస్టు బాక్సుల ద్వారానే గమ్యస్థానాలకు చేరేవి.

పెరుగుతున్న టెక్నాలజీ, డిజిటల్ కమ్యూనికేషన్ల కారణంగా రిజిస్టర్డ్ పోస్ట్ మరియు పోస్టు బాక్సుల వాడకం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి, సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను నిలిపివేయనున్నట్లు సమాచారం. ఈ సేవలను స్పీడ్ పోస్ట్‌లో విలీనం చేయడం ద్వారా డెలివరీ వేగం, ఖచ్చితత్వం మరియు ఆపరేషనల్ ఎఫిషియెన్సీని మెరుగుపరచాలని పోస్టల్ డిపార్ట్‌మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది.

India Post to Discontinue Registered Post Services from September 1

అయితే, ఈ కొత్త విధానం గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్టర్డ్ పోస్ట్ ఖరీదు కంటే స్పీడ్ పోస్ట్ ఖరీదు ఎక్కువగా ఉండటం దీనికి ప్రధాన కారణం. కొత్త విధానం అమలు కోసం, అన్ని డిపార్ట్‌మెంట్లు, కోర్టులు, విద్యా సంస్థలు, మరియు వినియోగదారులు సెప్టెంబర్ 1 నాటికి కొత్త వ్యవస్థకు మారాలని పోస్టల్ డిపార్ట్‌మెంట్ సూచించింది.

ఈ నిర్ణయంపై పోస్టల్ ఉద్యోగి అఖిలేష్ కాసాని స్పందిస్తూ... ఈ సేవలతో సంస్థకు పెద్దగా ఉపయోగం లేదని, ఆర్థిక భారం మాత్రం తప్పడం లేదని అన్నారు. అన్ని సంస్థలు టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, పోస్టల్ వ్యవస్థ కూడా ఈ మార్పును అందిపుచ్చుకుని మెరుగైన సేవలు అందించడానికి ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+