అధ్యక్షుడికి అరుదైన కానుక, ఫిడేల్ వాయించిన మోడీ(ఫోటోలు)
న్యూఢిల్లీ: తన మూడు రోజుల చైనా పర్యటనను ముగించుకుని ఆదివారం ఉదయం మంగోలియాకు చేరుకున్న ప్రధాని మోడీకి ఆ దేశంలో ఘన స్వాగతం లభించింది. మంగోలియా రాజధాని ఉలాన్ భతర్ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీయే. మంగోలియా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు.
ఆసియాలో శాంతి, స్ధిరత్వం, అభివృద్ధి కోసం మంగోలియాతో కలిసి పనిచేస్తామని అన్నారు. మానవ సంబంధాలతోనే ఆర్ధిక బంధాలు బలంగా మారుతాయన్నారు. మంగోలియా అధ్యక్షుడు సఖియాగిన్ ఎల్బిడోజ్కు ప్రధాని మోడీ అరుదైన కానుకను అందజేశారు. మంగోలియా చరిత్రను తెలియజేసే 13వ శతాబ్ధానికి చెందిన మను స్క్రిప్ట్ను బహూకరించారు.
దీనికి బదులుగా ఆ దేశాధ్యక్షుడు సఖియాగిన్ ప్రధాని మోడీకి మంగోలియా సంప్రదాయక ఫిడేల్ ఐన మోరిన్ కౌరిన్ను బహూకరించారు. మోరిన్ కౌరిన్ను వాయిస్తూ ప్రధాని మోడీ కాసేపు సందడి చేశారు. కానుకలు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత ఇరుదేశాల నేతలు సెల్ఫీలు కూడా దిగారు.

మంగోలియన్ల సభలో మోడీ, బహుమతిగా బోధి మొక్క
మంగోలియా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు.

మంగోలియన్ల సభలో మోడీ, బహుమతిగా బోధి మొక్క
ఆసియాలో శాంతి, స్ధిరత్వం, అభివృద్ధి కోసం మంగోలియాతో కలిసి పనిచేస్తామని అన్నారు. మానవ సంబంధాలతోనే ఆర్ధిక బంధాలు బలంగా మారుతాయన్నారు.

మంగోలియన్ల సభలో మోడీ, బహుమతిగా బోధి మొక్క
భారతదేశం అనుసరిస్తోన్న తూర్పు విధాన చట్టంలో మంగోలియా అంతర్భాగమని మోడీ పేర్కొన్నారు. మంగోలియాలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

మంగోలియన్ల సభలో మోడీ, బహుమతిగా బోధి మొక్క
ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం ఐదు దశాబ్ధాల క్రితం మంగోలియాకు భారత్ మద్దతు పలికిందని గుర్తు చేశారు.

మంగోలియన్ల సభలో మోడీ, బహుమతిగా బోధి మొక్క
ఆథ్యాత్నిక ఉన్నతి గల మంగోలియాకు పొరుగుదేశంగా ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నామని, భారత్కు ఇస్తోన్న గౌరవానికి తగ్గట్లుగానే మంగోలియా అభివృద్ధి బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తిస్తామన్నారు. మంగోలియాలో మౌళిక వసతుల కల్పన కోసం బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

మంగోలియన్ల సభలో మోడీ, బహుమతిగా బోధి మొక్క
మంగోలియా ప్రధానమంత్రి చిమెద్ సాయికన్ బిలెగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 14 దైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఇరుదేశాల అధికారులు సంతకాలు చేశారు. అంతకుముందు ప్రసిద్ధ గాంధన్ బౌద్ధారామాన్ని ప్రధాని మోడీ సందర్శించారు.

అధ్యక్షుడికి అరుదైన కానుక, ఫిడేల్ వాయించిన మోడీ
మంగోలియా అధ్యక్షుడు సఖియాగిన్ ఎల్బిడోజ్కు ప్రధాని మోడీ అరుదైన కానుకను అందజేశారు. మంగోలియా చరిత్రను తెలియజేసే 13వ శతాబ్ధానికి చెందిన మను స్క్రిప్ట్ను బహూకరించారు.

అధ్యక్షుడికి అరుదైన కానుక, ఫిడేల్ వాయించిన మోడీ
మంగోలియా చరిత్రను తెలియజేసే 13వ శతాబ్ధానికి చెందిన మను స్క్రిప్ట్ను బహూకరించారు. దీనికి బదులుగా ఆ దేశాధ్యక్షుడు సఖియాగిన్ ప్రధాని మోడీకి మంగోలియా సంప్రదాయక ఫిడేల్ ఐన మోరిన్ కౌరిన్ను బహూకరించారు.

అధ్యక్షుడికి అరుదైన కానుక, ఫిడేల్ వాయించిన మోడీ
మోరిన్ కౌరిన్ను వాయిస్తూ ప్రధాని మోడీ కాసేపు సందడి చేశారు. కానుకలు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత ఇరుదేశాల నేతలు సెల్ఫీలు కూడా దిగారు.












Click it and Unblock the Notifications