ఎక్కడ నక్కినా.. బయటకు తీసుకురాగలం, ప్లాన్-బి సిద్దం:ఎయిర్ ఫోర్స్ చీఫ్
తమకు పూర్తి బలం(42 స్వ్కాడ్రన్లు) లేకపోయినా ప్లాన్-బి అమలు చేసి పోరాడగలమని ధనోవా అన్నారు.
న్యూఢిల్లీ: చైనా నుంచి వచ్చే ఎలాంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వాయుదళాధిపతి బీఎస్ ధనోవా పేర్కొన్నారు. సరిహద్దు వెంబడి శత్రువు ఏ ప్రదేశంలో నక్కి ఉన్నా.. గుర్తించి బయటకు తీసుకురాగల సత్తా భారత వాయుసేనకు ఉందని చెప్పారు.
తమకు పూర్తి బలం(42 స్వ్కాడ్రన్లు) లేకపోయినా ప్లాన్-బి అమలు చేసి పోరాడగలమని ధనోవా అన్నారు. రానున్న ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధనోవా ఈ వ్యాఖ్యలు చేశారు.

2032కల్లా భారతీయ వాయుదళం పూర్తి బలాన్ని చేకూర్చుకుంటుందని చెప్పారు. ఇక డోక్లాం వివాదం గురించి ప్రస్తావిస్తూ.. చైనా దళాలు టిబెట్ లోని చుంబీ వ్యాలీలో ఉన్నాయని తెలిపారు. అయితే ఆ ప్రాంతం నుంచి చైనా దళాలు వెనక్కి వెళ్తాయని తాము భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications