భారత్లో భారీగా తగ్గిన కరోనా కేసులు: 35వేల లోపే కొత్త కేసులు, మరణాలు కూడా తగ్గాయి
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 346 మంది వైరస్ బారిన పడగా, సుమారు 1 లక్ష మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు. భారతదేశం గత 24 గంటల్లో 91,930 రికవరీలను నివేదించగా, దేశం రోజువారీ పాజిటివిటీ రేటు రేటు 3.19% శాతానికి తగ్గింది.
దేశంలో ప్రస్తుతం 4,78,882 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 4,16,77,641 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 5,09,011కు చేరింది. ఇప్పటి వరకు దేశంలో 1,72,95,87,490 మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారు.

మహారాష్ట్ర
మహారాష్ట్రలో ఆదివారం 3,502 కొత్త కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, క్రితం రోజు కంటే 850 తక్కువ, దీంతో రాష్ట్ర ఇన్ఫెక్షన్ల సంఖ్య 78,42,949కి చేరుకోగా, 17 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 1,43,404 కు చేరుకున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
శనివారం, రాష్ట్రం 4,359 కేసులను నమోదు చేసింది - మునుపటి రోజు కంటే వెయ్యికి పైగా తక్కువ, 32 మహమ్మారి సంబంధిత మరణాలను కూడా నివేదించింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 45,905 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో మొత్తం 9,815 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు, ఇది రాష్ట్రంలో మొత్తం రికవరీ సంఖ్యను 76,49,669కి పెంచిందని, రికవరీ రేటు 97.54 శాతంగా ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం 1,34,634 మందిని పరీక్షించగా, సంచిత పరీక్షల సంఖ్య 7,64,37,416కి చేరుకుందని డిపార్ట్మెంట్ తెలిపింది.
దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలను సడలిస్తున్నాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. కర్ణాటకలో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఆంక్షలను సడలించి సాధారణ పరిస్థితులకు అవకాశమిస్తున్నాయి.












Click it and Unblock the Notifications