వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్ఫేజ్-ఎయిర్: లాంగ్ రేంజ్ క్షిపణి ప్రయోగం విజయవంతం

|
Google Oneindia TeluguNews

బాలాసోర్‌: భారత్ మరో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలు ఛేదించగల లాంగ్‌ రేంజ్‌ క్షిపణిని మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్) నుంచి ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు డీఆర్‌డీఓ అధికారులు వెల్లడించారు.

కాగా, ఈ క్షిపణిని ఇజ్రాయెల్‌, భారత్‌ సంయుక్తంగా రూపొందించాయి. లాంగ్‌ రేంజ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని.. త్వరలో మరిన్ని విడతల్లో ఈ క్షిపణిని ప్రయోగిస్తామని అధికారులు తెలిపారు. ఈ క్షిపణిలో మల్టీ ఫంక్షనల్‌ సర్వైలెన్స్‌ అండ్‌ త్రెట్‌ అలర్ట్‌ రాడార్‌(ఎంఎఫ్‌-ఎస్‌టిఏఆర్) సిస్టమ్‌ ఉంటుంది.

భారత్‌, ఇజ్రాయెల్‌ రూపొందించిన ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే మీడియం రేంజ్‌ క్షిపణిని డీఆర్‌డీఓ జూన్‌ 30- జులై 1 మధ్య వరసగా మూడుసార్లు విజయవంతంగా ప్రయోగించింది.

నిరుడు ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా వాహక నౌకపై నుంచి కూడా ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే లాంగ్‌రేంజ్‌ క్షిపణి(ఎల్‌ఆర్‌-ఎస్‌ఏఎం)ని విజయవంతంగా ప్రయోగించారు. కాగా, తాజాగా ఈ క్షిపణి విజయవంతం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హర్షం వ్యక్తి చేస్తూ.. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

English summary
In a bid to galvanise its air defence capabilities, India on Tuesday successfully test fired a new, long range surface-to-air missile jointly developed with Israel from a defence base off Odisha coast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X