వావ్.. గ్లోబల్ శాలరీ హైక్లో ఇండియా అదుర్స్,మన తర్వాత డ్రాగన్
గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది గ్లోబల్ శాలరీలో భారత్ అత్యధిక పెంపు పొందనుంది. హైయస్ట్ శాలరీ ఇంక్రిజ్ జాబితాలో చేరింది. 2023 నాటికి అదీ 4.6 శాతంగా ఉండనుంది. గతేడాది ఇదీ 3.8 శాతంగా ఉంది. వర్క్ ఫోర్స్ కన్ల్టెన్సీ ఈసీఏ ఇంటర్నేషనల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించంది. ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాల్లో ఆసియాకు చెందినవి 8 దేశాలు ఉండటం విశేషం. ఇక్కడే జీతాల పెంపు భారీగా ఉంది. 2022లో యావరేజ్ శాలరీ 3.8గా ఉంది.
68 దేశాలు, ప్రదేశాల్లో గల 360 మల్టీ నేషనల్ కంపెనీల నుంచి వివరాలు తీసుకొని సర్వే చేపట్టిందని బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ చేసింది. దీనిలో ఇండియా వియత్నాం 4 శాతం, చైనా 3.8 శాతంతో మూడో స్థానంలో ఉంది. బ్రెజిల్ 3.4 శాతం, సౌదీ అరేబియా 2.3 శాతం 2023లో హైక్ ఉండనుంది. దాయాది దేశం పాకిస్థాన్ -9.9 శాతం, ఘన-11.9 శాతం, టర్కీ-14,4 శాతం, శ్రీలంక -20,5 శాతంగా ఉంది.

ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున వచ్చే ఏడాది జీతాల పెంపు పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నందున.. 37 శాతం దేశాలు మాత్రమే రియల్ టర్మ్ వేతనాల పెంపును నివేదించాలని భావించాయి. ఇందులో యూరప్ బాగా దెబ్బతిననుంది. 2000 తర్వాత ఈ ఏడాదే యూకేకు చెందిన ఉద్యోగులు శాలరీ హైక్ తక్కువగా ఉండనుంది. యావరేజీగా 37 శాతం ఉండనుంది. నిజానికీ 5.6 శాతం కావాల్సి ఉన్న.. ద్రవ్యోల్బణం దెబ్బ పడింది.2023లో అవీ మరో 4 శాతం తగ్గుతాయనే చెదు వార్తను సర్వే వెల్లడించింది. అమెరికాలో కూడా ద్రవ్యోల్బణం ప్రభావం చూపనుంది. 4.5 శాతం తగ్గనుంది.












Click it and Unblock the Notifications