కశ్మీర్ లేని భారత్, చైనాలో అరుణాచల్ ప్రదేశ్! మోడీకి ఫిర్యాదు చేసిన ఎన్నారై..
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లేకుండా భారతదేశాన్ని ఊహిచుకోగలమా? కానీ ఈ రెండు ప్రాంతాలు లేకుండానే ఇండియా మ్యాపులు, గ్లోబులు విపరీతంగా తయారు కావడమేకాదు, వాటి అమ్మకాలూ యథేచ్ఛగా సాగుతున్నాయి.
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ రిటైల్ చెయిన్ సంస్థ కోస్ట్కో.. కెనడా, అమెరికాల్లో ఇలాంటి మ్యాప్లను విక్రయిస్తుండడం వివాదాస్పదంగా మారింది. కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లు లేకుండా తయారైన గ్లోబ్లు కోస్ట్కో స్టోర్లో దర్శనమిస్తున్నాయి.
Dear Modiji, @narendramodi
— Joe (@JoeEmani) December 13, 2017
I am a resident of NewJersey, USA from Hyderabad India.
I came across this Picture of an educational globe sold in a US retail store Costco and other active online websites like AMAZON.
The pic shows Kashmir as No Mans Land not in sync to India Map. pic.twitter.com/TXhA9pj3kP
వాల్మార్ట్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రిటైల్ సంస్థ అయిన కోస్ట్కోకు అమెరికా, కెనడా, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఐస్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో 700కిపైగా స్టోర్లున్నాయి.
ఆ స్టోర్లో అమ్మకానికి ఉంచిన గ్లోబ్లలో కశ్మీర్ను ప్రత్యేక ప్రాంతంగా, అరుణాచల్ ప్రదేశ్ను చైనా భూభాగంలో చూపించారు. ఇలా తప్పుల తడకగా ఇండియా మ్యాప్ను, గ్లోబ్లను రూపొందించడంపై పలువురు నెటిజన్లు, ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
@SushmaSwaraj
— bhavesh dave (@bombay411) December 13, 2017
🇮🇳🇮🇳🇮🇳🇮🇳Today in Costco we are shocked when we saw this “India without kashmir”.This was a globe made in china.we gave a complaint regarding this to the costco management .so, anyone went to costco complain about this to the management.Lets raise our Voi pic.twitter.com/jvl2Mxgqsr
ఈ గ్లోబ్ల మీద 'మేడిన్ చైనా' ముద్ర కనిపిస్తోంది. దీంతో ఈ గ్లోబ్ల అమ్మకాలు తక్షణమే నిలిపివేయాలంటూ పలువురు ఎన్నారైలు కోస్ట్కో స్టోర్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు కొందరు ఎన్నారైలు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇండియా మ్యాప్ తప్పుగా ఉన్న గ్లోబ్ను న్యూజెర్సీలోని కోస్ట్కో స్టోర్తోపాటు అమెజాన్లో విక్రయిస్తుండటం చూశానని హైదరాబాద్కు చెందిన జోయ్ ట్విట్టర్ ద్వారా ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు.