"ఆపరేషన్ సిందూర్"పై మరో వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ..
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల చోటు చేసుకున్న ఘోర ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేశానికి దారి తీసింది. ఈ దాడికి తగిన ప్రతిస్పందనగా, మే 7న భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులు కేవలం ప్రతీకార చర్యగా కాకుండా.. బాధిత కుటుంబాలకు ఇండియన్ ఆర్మీ చేసిన న్యాయం అని స్పష్టం చేసింది.
Planned, Trained, Executed...
భారత సైన్యం పశ్చిమ కమాండ్ తాజాగా విడుదల చేసిన వీడియోలో.. "Planned, Trained, Executed" అనే నినాదంతో సైనికుల ప్రణాళికాను ప్రజలకు వివరించారు. వీడియోలో కనిపించిన సైనికులు - ''ఇది కేవలం ప్రతీకారం కాదు, బాధితుల కోసం న్యాయం. పాకిస్థాన్ తరతరాలకు గుర్తుండేలా గుణపాఠం నేర్పాం'' అని తెలిపారు.

పాకిస్థాన్లోని బహావల్పూర్, మురిద్కే వంటి ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసింది భారత సైన్యం. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. జైష్-ఎ-మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు భారత్ వైపు నిలబడితే టర్కీ మాత్రం పాకిస్థాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ సైనిక స్థావరాల జోలికి పోకుండా, కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన చోట్లనే మన బలగాలు ప్రహరించాయి. అత్యంత పక్కా ప్రణాళికతో, ప్రెసిషన్ స్ట్రైక్స్తో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని కాల్చి చంపారు. దీంతో మృతుల భార్యాలకు నుదుట సిందూరాన్ని దూరం చేసిన కారణంగానే ఈ ఆపరేషన్కు 'సిందూర్' అని నామకరణం చేసినట్టు స్పష్టం చేశారు.
#StrongAndCapable#OpSindoor
— Western Command - Indian Army (@westerncomd_IA) May 18, 2025
Planned, trained & executed.
Justice served.@adgpi@prodefencechan1 pic.twitter.com/Hx42p0nnon
ఇండియన్ ఆర్మీ దాడులు జరిపిన 9 ప్రధాన ఉగ్ర స్థావరాల్లో 4 పాకిస్తాన్లో, 5 పీఓకేలో ఉన్నాయి. ఇందులో ముంబై దాడుల సూత్రదారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కంచుకోట మురీడ్కే కూడా ఉంది. ముజఫరాబాద్లో 2 శిబిరాలు, కోట్లి, గుల్పూర్, భీమ్బర్, సియాల్కోట్, చకంబ్రూ, మురీడ్కే, బహావల్పూర్ వంటి ప్రదేశాలు ఇందులో ఉన్నాయి.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications