పాక్ కు సరైన బుద్ది చెప్పాం.. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం అదే..?
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాపిష్టి పాక్ కు భారత సైన్యం సరైన బుద్ధి చెప్పింది. పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం కోరుకున్న ప్రతి భారతీయుడికి కొత్త ఊపిరిని ఇచ్చింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించింది. పాక్ సైన్యం చేస్తున్న దాడులను తిప్పి కొట్టడమే కాక.. దాయాదిపైనే బాంబుల వర్షం కురిపించింది. పదుల సంఖ్యలో సైన్యంతో పాటు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. తాజాగా ఆ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను భారత DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు.
ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు రాజీవ్ ఘాయ్. తాము చేపట్టిన ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తేల్చి చెప్పారు. భారత సైన్యం ముందు నిలవలేక ఉగ్రశిబిరాలు ఖాళీ అవుతున్నాయన్నారు. పీవోకేలో 5, పాకిస్థాన్ లో 4 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసినట్లు వెల్లడించారు.

పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తమకి అన్ని అధికారాలు ఇచ్చిందని.. దీంతో ఉగ్రవాదులకు దీటుగా బదులివ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఉగ్రవాదులకు సరైన రీతిలో జవాబు చెప్పాలన్నదే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమన్నారు త్రివిధ దళాతిపతులు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను కచ్చితమైన ఆధారాలతో గుర్తించి.. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ ఆపరేషన్ సిందూర్లో 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఐసీ 814 హైజాక్ ఘటన, 2019లో పుల్వామా దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు హతమయ్యారన వెల్లడించారు. వీరిలో యూసుఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదాసిర్ అహ్మద్ లాంటి కరుడుగట్టిన ముష్కరులున్నారని ఆర్మీ డీజీఎంవో రాజీవ్ ఘాయ్ వెల్లడించారు.
అలాగే ఈ నెల 8, 9వ తేదీ రాత్రి భారత్పై ఎయిర్ స్ట్రైక్ కి పాకిస్థాన్ యత్నించింది. డ్రోన్లు, మానవరహిత విమానాలు మనవైపు దూసుకొచ్చాయి. వాటన్నింటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. పౌరులపై దాడులను అడ్డుకున్నాం. డ్రోన్ దాడులకు ప్రతిగా పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై బలమైన దాడులు నిర్వహించాం. తమ ఫైటర్ జెట్ లతో పాకిస్థాన్ లో ఉన్న లక్ష్యాలను ఛేదించాం. లక్ష్యాల సాధనలో భారత్వైపు ఎలాంటి నష్టం లేకుండా దాడులు చేశాం. భారత్వైపు వచ్చిన ప్రతి డ్రోన్ను నిర్వీర్యం చేశామన్నారు భారత సైన్యాధికారులు.
లాహోర్, గుజ్రన్వాలా రాడార్ కేంద్రాలను ధ్వంసం చేశాం. డ్రోన్ల దాడుల సమయంలో పాకిస్థాన్ పౌరవిమానాలనూ ఆకాశంలోకి అనుమతించింది. పరిస్థితి గమనిస్తూ.. కచ్చితమైన లక్ష్యాలతో పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేశాం. మొత్తంగా మూడు రోజులపాటు కొనసాగిన దాడుల్లో 35 నుంచి 40 మంది పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్లు అంచనా వేస్తున్నామన్నారు.
#WATCH | Delhi: DGMO Lieutenant General Rajiv Ghai says "...Those strikes across those nine terror hubs left more than 100 terrorists killed, including high value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf and Mudasir Ahmed that were involved in the hijack of IC814 and the… pic.twitter.com/IeH6Je6STE
— ANI (@ANI) May 11, 2025
పాక్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు త్రివిధ దళాధిపతులు. పాక్ ప్రతిపాదన మేరకే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చామన్నారు.ృ అయినా కొన్ని గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్లీ డ్రోన్ దాడులు చేసిందని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి ఇవాళ కూడా కొనసాగితే తీవ్ర ప్రతిచర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications