Navy: నడి సముద్రంలో 36 మంది.. 30 గంటల పాటు ఉత్కంఠ.. చివరికి..!
చేపల వేటకు వెళ్లి నడి సముద్రంలో చిక్కుకుపోయిన 36 మంది మత్స్యకారులను భారత నావికాదళం రక్షించింది. ఐఎన్ఎస్ ఖంజర్ సాయంతో నేవీ దాదాపు 30 గంటలు శ్రమించి మత్య్సకారులను తీసుకొచ్చారు. తమిళనాడులోని నాగపట్టణం తీరం నుంచి 36 మత్స్యకారులు చేపల వేటకు బంగాళాఖాతంలోకి వెళ్లారు. సముద్రంలో వాతావరణ పరిస్థితుల కారణంగా వారు అనుకున్న సమయంలో తీరానికి చేరుకోలేకపోయారు.
ఆ తర్వత బోట్లలో ఇంధనం లేకపోవడం అదే సమయంలో ఇంజిన్లలో సమస్య తలెత్తడంతో వారంతా సముద్రంలో చిక్కుకుపోయారు. మత్స్యకారులు వారి కుటుంబాలకు సమాచారం ఇవ్వడంతో.. మత్స్యకారుల కుటుంబ సభ్యులు నేవీకి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన నేవీ బంగాళాఖాతంలో విధుల్లో ఉన్న ఐఎన్ఎస్ ఖంజర్ ను రంగంలోకి దింపింది.

నేవీ సిబ్బంది ఐఎన్ఎస్ తో మత్స్యకారుల కోసం గాలింపు చేపట్టారు. తమిళనాడు తీరానికి 129 నాటికల్ మైళ్ల దూరంలో మూడు పడవలు కనిపించాయి. దీంతో నేవీ సిబ్బంది వెంటనే అక్కడి వెళ్లి మత్స్యకారులను రక్షించారు. మూడు బోట్లకు తాడు కట్టి 30 గంటల పాటు శ్రమించి ఒడ్డుకు లాక్కొచ్చారు. మూడు ఫిషింగ్ నాళాలను నాగపట్టినంకు చెందిన సబారైనాథన్, కలైవానీ, వి సామిగా గుర్తించారు.మత్స్యకారులను చెన్నై హార్బర్కు సురక్షితంగా తీసుకొచ్చారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications