వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేరేవారి టికెట్ పై మీరు రైల్వే ప్రయాణం చేయొచ్చు!

|
Google Oneindia TeluguNews

తరుచుగా రైలు ప్రయాణం చేసేవారికి ఒక గమనిక. మీరు తరుచుగా ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి ఒకవేళ మీకు టికెట్ దొరక్కపోయినా వేరేవారి టికెట్ పై సులువుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. దానిగురించి తెలుసుకుందాం. ఇండియన్ రైల్వేస్ తాజాగా ఓ నిబంధన తీసుకొచ్చింది. మికు టికెట్ లేకపోయినా అత్యవసర సమయంలో మీ కుటుంబం సభ్యుల టికెట్‌పై ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది.

మీరు ఎవరి టికెట్ పై ప్రయాణం చేయాలనుకుంటున్నారో వారికి మీరు రక్తసంబంధీకులై ఉండాలి. అంటే తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టువులు లేదంటే పిల్లల పేరుపై టికెట్ ఉంటే ఆ టికెట్ పై సులభంగా ప్రయాణం చేయవచ్చు. ముందుగా ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో వారు తమ పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. రైలు బయలుదేరే 24 గంటల ముందుగా సంబంధిత రైల్వే అధికారులకు అవసరమైన పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి.

indian railway implements vikalp scheme

వాటిని రైల్వే ఉన్నతాధికారులు పరిశీలించి టికెట్ పై ప్రయాణించాల్సిన సభ్యుడి పేరును కూడా ఉంచుతారు. దీంతోపాటు విద్యాసంస్థల విద్యార్థులకు టికెట్ బదిలీ చేయవచ్చు. రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు అవసరమైన పత్రాలతో ఇన్ స్టిట్యూట్ కు సంబంధించిన పత్రాలతో అధికారులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత మీకు ఆ టికెట్ ను ఖరారు చేస్తారు.

పండగ సమయంలో సొంతూళ్లకు వెళ్లేందుకు రెండు నెలల ముందే టికెట్ బుక్ చేసుకున్నా దొరకని పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో టికెట్ల సమస్యను వికల్ప్ పథకంద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంది. వెయిటింగ్ లిస్టులో టికెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులు మరొక రైలులో సీటును కన్ ఫర్మ్ చేసుకోవచ్చు.

English summary
Even if you don't have a ticket, you can travel on the ticket of your family members in case of emergency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X