భారత సైనికులకు ఘోర అవమానం.. రైల్వే బోర్డుకు ఘాటు లేఖ !!

భారత దేశంలో ఎన్నికల నిర్వహణలో కీలకపాత్ర పోషించే భద్రతా దళాలకు, ఈసారి రైలు ప్రయాణం భారమైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వేలాది మంది సీఆర్‌పీఎఫ్ (CRPF) జవాన్లు, తిరుగు ప్రయాణంలో తీవ్ర నరకయాతన అనుభవించారు. ఈ మేరకు రైల్వే శాఖ వైఫల్యాలను ఎండగడుతూ, సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) రైల్వే బోర్డుకు ఘాటుగా లేఖ రాశారు.

ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది తరలింపు కోసం మొత్తం 230 ప్రత్యేక రైళ్లను కేటాయించగా, అందులో దాదాపు 200 రైళ్లు భారీగా ఆలస్యమయ్యాయి. సుమారు 150 రైళ్లు 10 నుంచి 15 గంటలు, మరో 50 రైళ్లు ఏకంగా 20 నుండి 25 గంటల జాప్యంతో గమ్యస్థానాలకు చేరుకున్నాయి. రైళ్ల రాకపోకల్లో నెలకొన్న ఈ అస్తవ్యస్తత వల్ల భోజన ఏర్పాట్లు గందరగోళంగా మారాయి. ఉదయం అందాల్సిన అల్పాహారం కూడా సాయంత్రం 5 గంటలకు అందిందంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

indian-soldiers-facing-heavy-issues-while-traveling-after-elections-and-shocking-letter-to-railway-b

రైళ్ల ఆలస్యం తలవని తలనొప్పిగా మారితే, బోగీల కొరత మరో ప్రధాన సమస్యగా మారింది. నిబంధనల మేరకు ప్రతి ప్రత్యేక రైలుకు 24 బోగీలను కేటాయించాల్సి ఉండగా, కేవలం 19 నుండి 20 బోగీలను మాత్రమే రైల్వే శాఖ సమకూర్చింది. 10 నుంచి 11 కంపెనీల జవాన్లు, వారి భారీ లగేజీ, పరికరాలను ఈ కొద్దిపాటి బోగీలలో సర్దడం అసాధ్యంగా మారింది. దీంతో రైలు లోపలి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారై, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రయాణంలో ఉండాల్సిన కనీస అవసరాలైన నీటి సరఫరా, బోగీల శుభ్రతను రైల్వే అధికారులు పూర్తిగా విస్మరించారు. నిర్ణీత స్టేషన్లలో రైళ్లను శుభ్రం చేయాల్సి ఉన్నా, చాలా చోట్ల ఆ పని జరగలేదు. ఫలితంగా బోగీలు అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెదజల్లాయి. ముఖ్యంగా మహిళా సిబ్బంది ఈ అపరిశుభ్రత వల్ల తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ సమస్యలన్నింటినీ లేఖలో ప్రస్తావించిన సీఆర్‌పీఎఫ్, భవిష్యత్తులో మెరుగైన ఏర్పాట్లు చేయాలని కోరగా, లోపాలను సరిదిద్దుతామని రైల్వే బోర్డు అధికారులు హామీ ఇచ్చారు.

CRPF రైల్వే బోర్డుకు కఠినమైన లేఖను ఎందుకు పంపింది?
ఎన్నికల విధులకు ప్రయాణించే సమయంలో CRPF సిబ్బందికి రైల్వే ఏర్పాట్లలో జరిగిన లోపాలను లేఖ ఎత్తి చూపింది, దీని వల్ల వారికి ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఎన్ని ప్రత్యేక రైళ్లు కేటాయించబడ్డాయి మరియు ఎంత ఆలస్యం జరిగింది?
సుమారు 230 ప్రత్యేక రైళ్లు కేటాయించబడ్డాయి; సుమారు 200 రైళ్లు తీవ్రంగా ఆలస్యమయ్యాయి, 150 రైళ్లు 10–15 గంటలు ఆలస్యం కాగా, 50 రైళ్లు 20–25 గంటలు ఆలస్యం అయ్యాయి.
రైళ్లలోని కోచ్‌ల సంఖ్య మరియు సిబ్బంది సామర్థ్యం విషయంలో ఎలాంటి సమస్య ఉంది?
ప్రతి ప్రత్యేక రైలుకు 24 కోచ్‌లు ఉండాలి, కానీ 19–20 మాత్రమే అందుబాటులో ఉన్నాయి, దీనివల్ల 10–11 బెటాలియన్లు వారి సామాను మరియు పరికరాలతో సరిపోయేలా ఇబ్బంది పడ్డారు.
ప్రయాణంలో పారిశుద్ధ్యం మరియు క్యాటరింగ్ సమస్యలు ఏమి నివేదించబడ్డాయి?
నీటి సరఫరా మరియు కోచ్‌ల పరిశుభ్రతను విస్మరించారు, చాలా స్టేషన్లలో శుభ్రతను పాటించలేదు, దీనివల్ల కోచ్‌లు మురికిగా మారాయి మరియు అసహ్యకరమైన వాసనలు వచ్చాయి, ఇది ప్రధానంగా మహిళా సిబ్బందిని ప్రభావితం చేసింది.
ఆందోళనలకు ప్రతిస్పందనగా రైల్ బోర్డు అధికారులు ఎలాంటి వాగ్దానం చేశారు?
గుర్తించిన లోపాలను పరిష్కరిస్తామని మరియు భవిష్యత్తులో మెరుగైన ఏర్పాట్లను అమలు చేస్తామని వారు వాగ్దానం చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+