ఫేస్బుక్లో మోడీపై వ్యంగ్యచిత్రం: భారత ఉపాధ్యాయురాలి తొలగింపు
దోహా: భారత ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్య చిత్రాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసిందన్న ఆరోపణలతో ఖతర్ రాజధాని దోహాలో ఓ ఉపాధ్యాయురాలిపై వేటు పడింది. ఇక్కడి భారతీయులకు చెందిన ఎంఈఎస్ స్కూల్లో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు వారంక్రితం తన ఫేస్బుక్ అకౌంట్లో మోడీకి సంబంధించి కార్టూన్ను పోస్ట్ చేసింది.
ఆమె తన ఫేస్బుక్లో స్కూల్ లోగోను కూడా ఉపయోగించారని, దీంతో పాఠశాల ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన యాజమాన్యం.. తొలుత మూడురోజులపాటు విచారణ నిమిత్తం ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది.

గురువారం ఆమెను పూర్తిగా విధుల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది. సదరు టీచర్ పేరును స్కూల్ యాజమాన్యం బయటపెట్టలేదు. ‘నేను ఎలాంటి తప్పూ చేయలేదు. ఎలాంటి కార్టూన్ను పోస్ట్ చేయలేదు. ఎవరినుంచో ఆ చిత్రం వస్తే దాన్ని షేర్ చేశానంతే.. మోడీని అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు' అని టీచర్ స్థానిక మీడియాకు తెలిపింది.
కాగా, ఆమె కార్టూన్ను పోస్టు చేసిన తర్వాత ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు భారతీయులు విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. దోహాలోని భారత ఎంబసీకి కూడా ఆమె పోస్టుపై ఫిర్యాదులు అందాయి. సదరు పాఠశాలకు తమకందిన ఫిర్యాదులను పంపించామని, అది ప్రైవేటు పాఠశాల కావడంతో తాము జోక్యం కోలేమని భారత ఎంబసీ అధికారి ఒకరు తెలిపారు. సదరు టీచర్ను తొలగించినట్లు తెలిసిందని ఆయన చెప్పారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications