భారత్లో కరోనా: 2కోట్లు దాటేసింది -ఒక్కరోజులోనే 3,449 మంది బలి -కొత్తగా 3.57 లక్షల కేసులు
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్నది. గడిచిన మూడు రోజులుగా రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గినట్లున్నా, కొవిడ్ మరణాలు మాత్రం కంట్రోల్ లోకి రాలేదు. కొవిడ్ కేసులకు సంబంధించి ఇప్పటికే పలు రికార్డులను అధిగమించిన భారత్ ఇప్పుడు 2కోట్ల మార్కును కూడా దాటేసింది. ఢిల్లీ సహా చాలా చోట్ల ఆక్సిజన్ లేక చనిపోతున్నవారి సంఖ్యా పెరుగుతూవస్తోంది...
కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,57,229 పాజిటివ్ కేసులు, 3,449 మరణాలు నమోదయ్యాయి. తాజా గణాంకాలతో కలిపి మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 2,02,82,833కు, మరణాల సంఖ్య 2,22,408కు పెరిగింది. గతవారం ఒకే రోజు 4లక్షలకు దగ్గరగా వెళ్లిన రోజువారీ కేసులు గడిచిన మూడు రోజులుగా క్రమంగా తగ్గుతూ 3.57లక్షలకు చేరింది.
భారత్లో ఫైజర్ వ్యాక్సిన్: సంచలన అడుగు -అతిపెద్ద కొవిడ్ సాయం -మోదీ సర్కార్ తాత్సారం, ఎవరికోసం?
నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3,20,289 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. తద్వారా మొత్తం రికవరీల సంఖ్య 1,66,13,292కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 29.33 కోట్ల పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ టీకాలు అందించే కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టినప్పటికీ, వ్యాక్సిన్ల కొరత కారణంగా ప్రక్రియ ముందుకుసాగడంలేదు. ఇప్పటి వరకు మొత్తం 15,89,32,921 డోసుల టీకాలు పంపిణీ అయినట్లు కేంద్రం తెలిపింది. కాగా,
Recommended Video
కొన్ని రాష్ట్రాల్లో ఊహించిన దాని కన్నా చాలా ముందే కోవిడ్ కేసుల్లో పెరుగుదల నిలిచిపోయిందని, రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలిపింది. తెలంగాణ, ఢిల్లీ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, పంజాబ్ సహా 13 రాష్ట్రాల్లో రోజువారీగా వస్తున్న కొత్త కేసుల్లో స్థిరీకరణ కనిపిస్తోం దని సోమవారం ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, పశ్చిమబెంగా ల్, కర్నాటక, కేరళ తదితర 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయన్నారు.