Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

LPG: కోలుకోవడానికి 4 ఏళ్లు? వణుకు పుట్టిస్తున్న వార్త

భారతదేశం తన ఎల్పీజీ అవసరాల కోసం 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అయితే, ఏప్రిల్ 15 నాటికి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఇరాన్ దాడులు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా పశ్చిమాసియా నుండి ఇంధన సరఫరాలు నిలిచిపోయాయి. ఈ సరఫరా వ్యవస్థలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కనీసం 3 నుండి 4 సంవత్సరాల సమయం పట్టవచ్చని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఉత్పత్తి కేంద్రాలు తాత్కాలికంగా ఆగిపోయాయా లేదా శాశ్వతంగా దెబ్బతిన్నాయా అనే అంశంపై ఇంకా స్పష్టత లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

యుద్ధానికి ముందు భారత్ పొందే ఎల్పీజీలో దాదాపు 90 శాతం హార్ముజ్ జలసంధి మీదుగానే వచ్చేది. ప్రస్తుతం ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరగడంతో మార్చి 24 నాటికి గల్ఫ్ దేశాల వాటా 55 శాతానికి పడిపోయింది. యూఏఈ (41%), ఖతార్ (22%), సౌదీ అరేబియా వంటి దేశాలు మన దేశ ఎల్పీజీ అవసరాల్లో 92 శాతాన్ని తీరుస్తున్నాయి. ఇప్పుడు ఈ దేశాల నుండే సరఫరా నిలిచిపోవడంతో భారత్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించినప్పటికీ, సుమారు 40-50 శాతం వరకు సరఫరా కొరత కొనసాగవచ్చని ఆర్థిక నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

India s LPG Crisis 2026 4-Year Recovery Expected as West Asia War Disrupts 90 Hormuz Supply Routes

సిలిండర్ ధరలకు రెక్కలు!

సరఫరా అంతరాయం రవాణా ఖర్చులను, బీమా ప్రీమియంలను ఆకాశానికి చేర్చింది. దీని ప్రభావం అప్పుడే వినియోగదారులపై కనిపిస్తోంది. మార్చి మధ్య కాలం నుండి దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర ₹60, వాణిజ్య సిలిండర్ ధర ₹115 మేర పెరిగింది. దేశీయ వార్షిక డిమాండ్ 33 మిలియన్ టన్నులు కాగా, ప్రస్తుతం మన వద్ద ఉన్న నిల్వలు కేవలం 15 రోజుల వినియోగానికి మాత్రమే సరిపోతాయి. ఇది రాబోయే రోజుల్లో ధరల అస్థిరతకు, భారీ కొరతకు దారితీసే ప్రమాదం ఉంది.

గుడ్ న్యూస్: అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా 5 కిలోల గ్యాస్ సిలిండర్
గుడ్ న్యూస్: అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా 5 కిలోల గ్యాస్ సిలిండర్

ప్రభుత్వ అభయం.. ఆయిల్ కంపెనీలకు భయం!

గృహాలకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. కోవిడ్ సమయంలో అనుసరించిన వనరుల విస్తరణ, దేశీయ ఉత్పత్తి పెంపు వంటి అత్యవసర చర్యలను ఇప్పుడు మళ్లీ అమలు చేయాలని భావిస్తోంది. అయితే, రిఫైనరీలకు ఉత్పత్తి పెంచమని ఆదేశించడం వల్ల వాటి లాభాల మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు, పెరిగిన ధరల భారం హోటళ్లు, రెస్టారెంట్లు , చిన్న తరహా సంస్థలపై పడుతోంది. సబ్సిడీ భారం పెరుగుతుండటంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంది.

PNG కనెక్షన్ కావాలా? ఈ నంబర్లకు కాల్ చేస్తే చాలు
PNG కనెక్షన్ కావాలా? ఈ నంబర్లకు కాల్ చేస్తే చాలు

దిగుమతులపై ఆధారపడటమే శాపమా?

భారత్ పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిలో ముందున్నప్పటికీ, ఎల్పీజీ, నాఫ్తా వంటి ఇంధనాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ బలహీనతే ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల్లో భారత్‌ను ఇరకాటంలో పడేసింది. సరఫరా వ్యవస్థలు పునరుద్ధరించబడటానికి పట్టే ఈ నాలుగేళ్ల కాలం.. భారత్ తన సొంత ఇంధన వనరులను పెంచుకోవడానికి , ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడానికి ఒక మేల్కొలుపు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+