ఆ దివ్యాంగుడిని అలా చూడలే, రాంచీ ఎయిర్ పోర్టు డైరెక్టర్, ఎలక్ట్రిక్ వీల్ చైర్ కొనిస్తా: ఇండిగో సీఈవో
దివ్యాంగుడిపై రాంచీ ఎయిర్ పోర్టులో అవమానం జరిగిన సంగతి తెలిసిందే. అతను అల్లరి చేస్తున్నాడని పేరంట్స్తో సహా ఫ్లైట్ ఎక్కడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇదీ దుమారం రేపింది. దీంతో రాంచీ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కేఎల్ అగర్వాల్ స్పందించారు. అలాంటిదేం లేదని చెప్పారు. తాము ఎప్పటికీ ప్రయాణికుల మద్దతుగా నిలుస్తామని.. వారి రక్షణ తమకు ప్రయారిటీ అని చెప్పారు.

హైదరాబాద్ రావాల్సి ఉండగా..
రాంచీ నుంచి వస్తోన్న దివ్యాంగుడు హైదరాబాద్ రావాల్సి ఉంది. అతనిని అడ్డుకున్నారు. దీనిని అగర్వాల్ ఖండించారు. వాస్తవానికి దివ్యాంగుడు అల్లరి చేశారని.. మమూలు స్థితికి వస్తే పంపిస్తామని ఇండిగో మేనేజర్ హెచ్చరించారనే వార్తలు వచ్చాయి. వారితో ఉన్న ప్రయాణికులు.. అందులో ఉన్న ఓ వైద్యుడు కూడా సపోర్ట్ చేశారు. కానీ అతనితోపాటు పేరంట్స్ కూడా అనుమతించలేదు. అతను తీవ్ర భయాందోళనలో ఉన్నాడని అందుకే పంపించలేదని ఇండిగో యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.

అందుకు పంపించకపోవచ్చు..
దివ్యాంగుడు కోపంతో ఉన్నాడని అగర్వాల్ తెలిపారు. అతను వేరే వారిపై దాడి చేస్తే పరిస్థితి ఏంటీ అనే ప్రశ్న తలెత్తింది. అందుకోసమే పంపించి ఉండకపోవచ్చు అని తెలిపారు. అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని.. వారు తిరస్కరించారని తెలిపారు. పుణె మీదుగా హైదరాబాద్ వెళ్లాలని కోరినా పట్టించుకోకపోవడంతో.. తెల్లవారున (ఆదివారం) ఉచితంగా హైదరాబాద్ పంపించామని తెలిపారు.

ఎలక్ట్రిక్ వీల్ చైర్ కొనిస్తా..
వివాదం ముదరడంతో ఇండిగో సీఈవో కూడా స్పందించారు. ఘటనపై రోనోజాయ్ విచారం వ్యక్తం చేశారు. తమ సిబ్బంది ఎమర్జెన్సీ సమయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ బాలుడికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కొనిస్తానని తెలిపారు. వారిని విమానంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చెక్ ఇన్, బోర్డింగ్ చేపట్టామని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యం అని తెలిపారు. ఆ సమయంలో భద్రతా మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ కుటుంబానికి జరిగిన ఘటనపై విచారం తెలిపారు. దివ్యాంగ చిన్నారుల కోసం జీవితాలకు అంకితం చేస్తోన్న పేరంట్స్ సమాజానికి నిజమైన హీరోలు అని తెలిపారు. వారి అంకితభావానికి అభినందనగా వీల్ చైర్ కొనివ్వాలని అనుకుంటున్నానని తెలిపారు.
పర్సనల్గా చూస్తా..
మరోవైపు రాంచీ ఎయిర్ పోర్టు ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఘటనకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివక్షకు తావులేదని.. ఈ విషయాన్ని తాను పర్సనల్గా చూస్తానని తెలిపారు. బాధ్యులపై చర్యలు తప్పవని ఆయన స్పష్టంచేశారు
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications