మహిళ అభ్యంతరకర ఫోటోలు తీసిన ఐపిఎస్కు పోస్టింగ్
బెంగళూరు: మహిళ అభ్యంతకర ఫోటోలు తీసిన ఐపిఎస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వడం వివాదానికి దారి తీసింది. కర్నాటకలో ఒక కాఫీ షాప్లో ఓ మహిళను అభ్యంతకరంగా ఫోటోలు తీశారనే ఆరోపణలు వచ్చిన సీనియర్ ఐపిఎస్ అధికారి పి రవీంద్రనాథ్కు ప్రభుత్వం తాజాగా పోస్టింగ్ ఇచ్చింది.
ఆ మహిళ ఫిర్యాదు నేపథ్యంలో కర్నాటక రిజర్వ్ పోలీసు అదనపు డీజీపీగా ఉన్న ఆయనను ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం బదలీ చేసింది. ఇప్పుడు పరిశోధన, పునర్నిర్మాణం విభాగం అదనపు డీజీపీగా నియమించింది. మహిళ ఫిర్యాదు, రవీంద్రనాథ్ బదలీ వ్యవహారంతో పోలీసు ఉన్నతాధికారుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.

రవీంద్రనాథ్ను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర లక్ష్యంగా చేసుకున్నారని, ఆయనను కేసులో ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ కర్నాటక రిజర్వ్ పోలీసు సిబ్బంది కొందరు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
మరోవైపు రవీంద్రనాథ్ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రాఘవేంద్రపై ఫిర్యాదు దాఖలు చేశారు. కేసు దర్యాఫ్తును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. రవీంద్రనాథ్ సోమవారం విచారణ నిమిత్తం సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications