రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు రీఓపెన్..
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా జూన్ 1 నుంచి దశలవారీగా అందుబాటులోకి రానున్న రైళ్లకు సంబంధించి ఆ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా ఐఆర్సీటీసీలో బుకింగ్స్ ప్రారంభించిన రైల్వే శాఖ.. శుక్రవారం నుంచి రైల్వే స్టేషన్లలోనూ టికెట్ విక్రయాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. పరిమిత స్థాయిలో, కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే రిజర్వషన్ కౌంటర్లను పున: ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఏయే స్టేషన్లలో కౌంటర్లు తెరుస్తారనే వివరాలను వెబ్ సైట్లో వెల్లడించనున్నారు.
జూన్ 1 నుంచి రైల్వే శాఖ 200 రైళ్లను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైళ్లలో ప్రయాణాల కోసం బుకింగ్స్ ఆన్ లైన్ లో గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో 73 ప్రత్యేక రైళ్ల మొదటి సెట్కు 1 లక్ష 49 వేల 025 టికెట్లు బుక్ అయినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఉదయం ఒక్కసారిగా అందరూ సైట్ ఓపెన్ చెయ్యడంతో ఐఆర్సిటిసి వెబ్సైట్ లో టెక్నికల్ సమస్యలు ఏర్పడి, కాసేపు సేవలు నిలిచిపోయాయి. దీనిపై రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ట్విటర్ లో అప్ డేట్స్ పెడుతూ వచ్చింది. ఇప్పుడు రైల్వే స్టేషన్లలోనే నేరుగా టికెట్ బుకింగ్ కౌంటర్లు తెరవనుండడంతో ప్రయాణికులకు మరింత ఊరట కలగనుంది.

Recommended Video
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా రాబోయే రోజుల్లో మరిన్ని రైళ్లను నడపబోతున్నామని మంత్రి పియూష్ గోయల్ ఒక ప్రకటన చేశారు. రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు తెరవడంతోపాటు లోపల దుకాణ సముదాయాలను కూడా అనుమతిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ దుకాణాల ద్వారా ప్రయాణికులు తమకు కావలసిన వస్తువులను తీసుకోవచ్చన్నారు.
జూన్ 1న తెలుగు రాష్ట్రాల మీదుగా నడిపే రోజువారీ రైళ్ల వివరాలను రైల్వే బోర్డు ఆన్లైన్లో వెల్లడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
(02701) - హైదరాబాద్ - ముంబయి
(02703) - హౌరా - సికింద్రాబాద్
(02805 )-విశాఖపట్నం- ఢిల్లీ
(02723 ) -హైదరాబాద్- న్యూఢిల్లీ
(02791 )-దానాపూర్- సికింద్రాబాద్
(07201)- గుంటూరు- సికింద్రాబాద్
(02793) - తిరుపతి- నిజామాబాద్
(02727)- హైదరాబాద్- విశాఖపట్నం
(02175) - నాందేడ్ - అమృత్ సర్
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications