Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జియో ఎఫెక్ట్: రోమింగ్ ఛార్జీల రద్దుకు ముందుకు వచ్చిన చైనా ఆపరేటర్లు

రిలయన్స్ జియో ఎపెక్ట్ దేశీయ కంపెనీలనే కాదు విదేశీ టెలికం ఆపరేటర్లకు కూడ ఇబ్బందిని కల్గిస్తోంది. దేశీయ టెలికం ఆపరేటర్లు తమ టారిఫ్ రేట్లను తగ్గించగా, చైనాకు చెందిన ముగ్గురు ఆపరేటర్లు కూడ దేశీయ రోమింగ్

న్యూఢిల్లీ:రిలయన్స్ జియో తో మూడు చైనామొబైల్ ఆపరేటర్లు దేశీయ రోమింగ్ ఛార్జీలను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకొన్నాయి.గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్ ఈ విషయాన్ని ప్రకటించింది.ఇప్పటికే దేశీయ టెలికం కంపెనీలు తమ టారిఫ్ ధరల్లో మార్పులు చేర్పులు చేశాయి.

రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించడంతో దేశీయ టెలికం కంపెనీలు తమ టారిఫ్ రేట్లలో మార్పులు చేర్పులు చేశాయి. ఈ మేరకు తమ కస్టమర్లు జియో వైపుకు మరలకుండా ఉండేందుకు వీలుగా ఉచిత ప్లాన్ వైపుగా దేశీయ కంపెనీలు టారిప్ ప్లాన్లు మార్చాయి.

ఇండియాలో అతి పెద్ద నెట్ వర్క్ ఎయిర్ టెల్ ఉచిత ఆఫర్లను తన కస్టమర్లకు ప్రకటించింది. ఐడియా, వోడాఫోన్ లు కూడ తమ కస్టమర్ల కోసం ఉచిత ఆఫర్లను ప్రకటించాయి.

అయితే రిలయన్జ్ జియో దెబ్బకు అన్ని టెలికం కంపెనీలు తమ టారిఫ్ లలో మార్పులు చేర్పులు చేయల్సిన పరిస్థితులు అనివార్యంగా నెలకొన్నాయి.అయితే ఈ ప్రమాదం ఇంకా కన్పిస్తోంది.

జియో దెబ్బకు దిగొచ్చిన చైనా ఆపరేటర్లు

జియో దెబ్బకు దిగొచ్చిన చైనా ఆపరేటర్లు

రిలయన్స్ జియో దెబ్బకు దేశీయ టెలికం కంపెనీలు తమ టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేర్పులు చేశాయి.అయితే తాజాగా మూడు చైనాకు చెందిన మొబైల్ ఆపరేటర్లు కూడ టారిఫ్ లలో మార్పులు చేర్పులకు సిద్దమయ్యాయి.దేశీయ రోమింగ్ ఛార్జీలు రద్దు చేయడానికి నిర్ణయించుకొన్నాయి. ఈ మేరకు మొబైల్ అసోసియేష్ ప్రకటన కూడ చేసింది.దేశీయ రోమింగ్ చార్జీలపై తామిచ్చిన పిలుపుకు చైనా ప్రముఖ ఆపరేటర్ల నుండి అద్భుతమైన మద్దతు లభించిందని టెలికం మార్కెట్ అధ్యక్షుడు సునీల్ మిట్టల్ చెప్పారు.

అక్టోబర్ నుండి ఇంటర్ ఫ్రావిన్స్ రోమింగ్ ఛార్జీలు రద్దు

అక్టోబర్ నుండి ఇంటర్ ఫ్రావిన్స్ రోమింగ్ ఛార్జీలు రద్దు

చైనా యునైటెడ్ నెట్ వర్క్ కమ్యూనికేషన్స్ గ్రూప్ ఈ ఏడాది అక్టోబర్ నుండి ఇంటర్ ఫ్రావిన్స్ రోమింగ్ చార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.బిల్లుల భారాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుడికి సౌలభ్యంతో పాటు ప్రోత్సాహాన్ని అందించనున్నట్టు చెప్పారు. ఇతర దేశాల్లోని వివిధ ఆపరేటర్లు కూడ చైనాను ఆదర్శంగా తీసుకోవాలని సునీల్ మిట్టల్ కోరారు.

జియో ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా స్పెషల్ ప్యాక్ లు

జియో ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా స్పెషల్ ప్యాక్ లు

ఏప్రిల్ 1వ, తేది నుండి జియో దాని సేవలకు చార్జీలను ప్రారంభించనున్నాయి. ఇవి ప్రీ పెయిడ్ వినియోగదారులకు రూ.19 , పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు రూ.149 నుండి ప్రారంభం కానున్నాయి. జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్ల ద్వారా స్పెషల్ ప్యాక్ లను ప్రకటించింది.అయతే ఏప్రిల్ 1వ, తేది నుండి ఎయిర్ టెల్ నేషనల్ రోమింగ్ చార్జీలను రద్దు చేస్తోంది.

అంతర్జాతీయ రోమింగ్ చార్జీలను 90 శాతం తగ్గింపు

అంతర్జాతీయ రోమింగ్ చార్జీలను 90 శాతం తగ్గింపు

అంతర్జాతీయ రోమింగ్ చార్జీలను ఎయిర్ టెల్ సుమారు 90 శాతం వరకు తగ్గించనుంది. నేషనల్ ఇన్ కమింగ్ రోమింగ్ చార్జీ ప్రస్తుతం ఒక నిమిషానికి 45 పైసలు వసూలు చేస్తుండగా, అవుట్ గోయింగ్ కాల్స్ , చార్జీలు రద్దు కానున్నాయి.గ్లోబల్ టెలికం పరిశ్రమకు సునీల్ మిట్టల్ చైర్మెన్ గా ఉన్నారు. గత ఏడాది ఆయన బాద్యతలను స్వీకరించారు. గ్లోబల్ టెలికం పరిశ్రమకు చైర్మెన్ గా ఎన్నికైన తొలి భారతీయుడు మిట్టల్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+