అరవింద్ కేజ్రీవాల్: రాజ్ నారాయణ్, ఎన్టీఆర్లతో పోలిక
ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఊడ్చిపెట్టడమే కాకుండా స్వయంగా షీలా దీక్షిత్ను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుండి ఓడించడం గమనార్హం.
ఇక మన రాష్ట్రంలో కొందరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు, కేజ్రీవాల్కు పోలిక తెస్తున్నారు. 1983లో వెండితెరను ఏలుతున్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టింది. అలాగే ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో అధిక ఎంపీ సీట్లు గెలిచి పార్లమెంటులో ప్రతిపక్షంగా నిలిచిన మొదటి ప్రాంతీయ పార్టీగా సంచలనం సృష్టించింది.
అప్పట్లో బిజెపి దేశవ్యాప్తంగా రెండు సీట్లు గెలువగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 33 సీట్లు సాధించింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పార్టీని స్థాపించి గెలవకపోయినా గెలిచినంత పని చేశారు. కాంగ్రెసును మట్టికరిపించి, బిజెపికి ముచ్చెమటలు పోయించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎఎపి 28 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే.