వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీ తర్వాత...: లిస్ట్‌లో వెంకయ్యనాయుడు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెంబర్‌-2 ఎవరు? అనే చర్చ కొద్ది రోజులుగా సాగుతోంది. నిన్న మొన్నటి వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌నాథ్‌సింగా? మోడీకి అత్యంత సన్నిహితుడైన అరుణ్‌ జైట్లీనా? అందరికీ తలలో నాలుకైన వెంకయ్యనాయుడా? అనే చర్చ సాగుతోంది.

తన ప్రభుత్వంలో నెంబర్‌ 2 ఎవరనే విషయాన్ని మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తేల్చి చెప్పడం లేదు! వాస్తవానికి, ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ వ్యవహారాలను చూసేందుకు ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారు. ఆయనే ప్రభుత్వంలో నెంబర్‌ 2గా వ్యవహరిస్తారు.

Is Rajnath Singh at number 2?

కానీ తాను విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు నెంబర్‌ 2 ఎవరనే ఉత్త్తర్వులు జారీ చేయలేదు. దీంతో జైట్లీ, రాజ్‌నాథ్‌ల్లో ఎవరు నెంబర్‌ 2 అనే విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. మోడీ విదేశీ పర్యటనలో ఉండగానే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కానీ, దానికి ఎవరూ అధ్యక్షత వహించలేదు. దీనిని బట్టి, ప్రభుత్వంలో నెంబర్‌ 2 అనేది ఎవరూ లేరని, అన్నీ మోడీనేనని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు అయిందంటున్నారు.

సాధారణంగా పార్లమెంట్‌లో ప్రధాని తర్వాత సీటును నెంబర్‌ 2కు కేటాయిస్తారు. ఈ సీటును హోంమంత్రి రాజ్‌నాథ్‌కే కేటాయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే కనుక జరిగితే ఎన్డీయే సర్కారులో రాజ్‌నాథే నెంబర్‌ 2 అని చెప్పకనే చెప్పినట్లవుతుందని చెబుతున్నారు. మరోవైపు, ఇటీవల మోడీ విదేశాలకు వెళ్లినప్పుడు వెంకయ్య నాయుడు అన్ని వ్యవహారాలు చూశారు.

English summary
The BJP-led NDA government ended the suspense over who is number two on Tuesday after Prime Minister Narendra Modi conveyed to his Cabinet colleagues that Home Minister Rajnath Singh will occupy that post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X