Aditya L1: తుది దశకు చేరుకున్న ఆదిత్య ఎల్1..
ఆదిత్య ఎల్1(Aditya L1) వ్యోమనౌక చివరి దశకు చేరుకుందని, ఎల్1 పాయింట్లోకి ప్రవేశించే విన్యాసాలు జనవరి 7, 2024 నాటికి పూర్తవుతాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. భారత్ నుంచి తొలి రాకెట్ ప్రయోగానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి సోమనాథ్ హాజరయ్యారు. "బహుశా జనవరి 7 నాటికి, L1 పాయింట్లోకి ప్రవేశించడానికి తుది విన్యాసాలు జరుగుతాయి" అని ఇస్రో చీఫ్ చెప్పారు.
సెప్టెంబర్ 2న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్డిఎస్సి) నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్వి)-సి 57 ఉపయోగించి ఆదిత్య ఎల్1ను విజయవంతంగా ప్రయోగించారు. 125 రోజుల పాటు భూమి నుంచి 1.5 మిలియన్ కి.మీ ప్రయాణించిన తర్వాత, అంతరిక్ష నౌకను సూర్యుడికి దగ్గరగా భావించే లాగ్రాంజియన్ పాయింట్ L1 చుట్టూ హాలో కక్ష్యలో ఉంచనున్నారు.

అలాగే, అంతరిక్ష నౌక శాస్త్రీయ ప్రయోగాల కోసం సూర్యుడి చిత్రాలను ఆదిత్య ఎల్ 1 ఎప్పటికప్పుడు ఇస్రోకు పంపిస్తుంది. భారత్ ఈ సంవత్సరం అంతరిక్ష ప్రయోగల పరంగా అతి పెద్ద విజయాన్ని అందుకుంది. చంద్రయాన్-3ని విజయవంత ప్రయోగించి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇస్రో
చంద్రయాన్-4 కోసం ప్రణాళిక రచిస్తోంది. చంద్రుని ఉపరితలంపై ఉన్న నీటి పరిమాణం మరియు రూపాలపై డేటాను సేకరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
చంద్రయాన్-4 మిషన్ నీటి ఉనికిని గుర్తించడమే కాకుండా దాని పరిమాణం, చంద్రుని ఉపరితలం, భూమి దిగువన పంపిణీ, పొడి రెగోలిత్ కణాలతో పరస్పర చర్యతో సహా దాని వివిధ రూపాలను కూడా పరిశోధిస్తుంది. చంద్రుని ఉపరితలంపై నీరు దాని ప్రస్తుత స్థితికి ఎలా పరిణామం చెందిందో అర్థం చేసుకోవడం తెలుసుకోన్నారు.












Click it and Unblock the Notifications